Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ‌ని మెగా ప‌వ‌ర్ స్టార్ కురుణిస్తాడా?

By:  Tupaki Desk   |   3 Nov 2022 2:30 AM GMT
బుట్ట‌బొమ్మ‌ని మెగా ప‌వ‌ర్ స్టార్ కురుణిస్తాడా?
X
టాలీవుడ్ లో క్రేజ్ వున్న హీరోయిన్ ల చుట్టూ స్టార్ హీరోలు వెంట ప‌డుతుంటార‌న్న‌ది తెలిసిందే. కాజ‌ల్‌, స‌మంత‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, న‌య‌న‌తార ఇలా చెప్పుక‌రుంటూ పోతే చాలా మంది హీరోయిన్ లు స‌క్సెస్‌, ఫ్లాప్‌ ల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ స్టార్ ల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాల్ని సొంతం చేసుకుని అవాక్క‌య్యేలా చేశారు. అదే పంథాని అనుస‌రిస్తూ బుట్ట‌బొమ్మ సూజా హెగ్డే కూడా అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది.

'ఒక లైలా కోసం' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై చిన్న‌ది 'ముకుంద' సినిమాతో కొంత మేర అటెన్ష‌న్ ని క్రియేట్ చేయ‌గ‌లిగింది. అయితే త‌న‌కు బిగ్ బ్రేక్ ని అందిందించింది మాత్రం 'డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌'. ఈ మూవీ త‌రువాత బ్యాక్ టు బ్యాక్ క్రేజీ స్టార్ ల స‌ర‌స‌న న‌టిస్తూ స్టార్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది. 2020లో అల్లు అర్జున్ తో క‌లిసి పూజా హెగ్డే న‌టించిన ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామా 'అల వైకుంఠ‌పుర‌ములో' ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది.

అంతే కాకుండా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి త‌మ‌న్ కార‌ణంగా మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంది. ఈ మూవీ త‌రువాత పూజా హెగ్డే త‌న పారితోషికాన్ని అమాంతం పెంచేయ‌డంతో అక్క‌డి నుంచి త‌న‌కు కెరీర్ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. కారోనా త‌రువాత ఫేట్ పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో క‌లిసి న‌టించిన 'రాధేశ్యామ్‌', ఆ త‌రువాత మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల కాంబినేష‌న్ లో కొర‌టాల శివ రూపొందించిన మూవీ 'ఆచార్య‌'లో న‌టించింది.

ఊహించ‌ని విధంగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్టర్ లుగా నిలిచి పూజా హెగ్డే కెరీర్ ని ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డేశాయి. విజ‌య్ తో క‌లిసి చేసిన 'బీస్ట్' ప‌రిస్థితి ఇందే. పైగా పూజా హెగ్డే క్యారెక్ట‌ర్ కు అదులో పెద్ద‌గా స్కోప్ కూడా లేదు. ఈ స‌మ‌యంలో గురూజీ త్రివిక్ర‌మ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా SSMB28 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్నాడు.

మ‌హేష్ కార‌ణంగా ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ గ‌త కొన్ని నెల‌లుగా వాయిదా ప‌డి ఎట్ట‌కేల‌కు ఇటీవ‌ల ఫ‌స్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. త‌దుప‌రి షెడ్యూల్ స్టార్ట్ చేయ‌డానికి మ‌హేష్ కోసం త్రివిక్ర‌మ్ ఎదురుచూస్తున్నాడు. ఇటీవ‌ల మ‌హేష్ మ‌ద‌ర్ ఇందిరా దేవి మృతిచెంద‌డంతో ఈ మూవీ త‌దుప‌రి షెడ్యూల్ కి బ్రేకిచ్చారు. ఇది ఎప్పుడు మొద‌లై ఎప్పుడు పూర్త‌వుతుందా? అని త్రివిక్ర‌మ్ తో పాటే పూజా హెగ్డే ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. కార‌ణం మ‌హేస్ ఎప్ప‌డు షూట్ అంటాడో .. ఎప్ప‌డు ప్యాక‌ప్ అంటాడో తెలియ‌ని ప‌రిస్థితి. ఆ కార‌ణంగానే పూజా హెగ్డే మ‌రో ప్రాజెక్ట్ కు క‌మిట్ కావ‌డం లేద‌ట‌.

అయితే త‌న‌కు ఆఫ‌ర్ ఇచ్చే హీరో కూడా ఇప్ప‌డు ఎవ‌రూ లేక‌పోవ‌డం తో పూజా హెగ్డే ఆఫ‌ర్ ఇచ్చే హీరో కోసం ఎదురుచూస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బుట్ట‌బొమ్మ‌కున్న ఏకైక ఆప్ష‌న్ రామ్ చ‌ర‌ణ్‌. శంక‌ర్ మూవీ త‌రువాత చ‌ర‌ణ్ మ‌రో సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. డైరెక్ట‌ర్‌, ప్రాజెక్ట్ ఫైన‌ల్ అయితే హీరోయిన్ గా పూజా హెగ్డే క‌ర్చీఫ్ వేయాల‌ని చూస్తోంద‌ట‌. మ‌రి చ‌ర‌ణ్ బుట్ట‌బొమ్మ‌ని క‌రుణిస్తాడా? అన్న‌ది వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.