Begin typing your search above and press return to search.

చిరు అనిపిస్తున్నారు..స్టార్ డైరెక్ట‌ర్స్ మ‌మా అంటున్నారు

By:  Tupaki Desk   |   23 April 2022 9:30 AM GMT
చిరు అనిపిస్తున్నారు..స్టార్ డైరెక్ట‌ర్స్ మ‌మా అంటున్నారు
X
మెగాస్టార్ చిరంజీవి కొత్త‌గా స్టార్ డైరెక్ట‌ర్స్ ని బ్లాక్ చేసుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ వారితో సినిమాలు చేయాలని ఆశ ప‌డుతున్నారు. ఇందుకు ఏదో ఒక మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ని వేదిక‌గా చేసుకుంటూ స్టార్ డైరెక్ట‌ర్ ల‌ని అంద‌రి ముందు మ‌మా అనిపించేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇది ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌తో పాటు అభిమానుల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చిరు అనిపించ‌డం.. స్టార్ డైరెక్ట‌ర్స్ మ‌మా అన‌డం ఈ మ‌ధ్య కామ‌న్ గా మారింది. మునుపెన‌ప్న‌డూ లేనంత‌గా సినిమా విష‌యంలో చిరు స్పీడు పెంచిన విష‌యం తెలిసిందే.

స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో క‌లిసి చేసిన `ఆచార్య‌` ఏప్రిల్ 29న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. దీని త‌రువాత మ‌రో నాలుగు చిత్రాలు లైన్ లో వున్నాయి. మోహ‌న్ రాజాతో చేస్తున్న `గాడ్ ఫాద‌ర్‌`, మెహెర్ ర‌మేష్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న `భోళా శంక‌ర్‌`.. బాబీ డైరెక్ట్ చేస్తున్న `వాల్తేరు వీర‌య్య‌` చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి. ఇక వెంకీ కుడుముల‌తో దాన‌య్య నిర్మించ‌నున్న మూవీ ప‌ట్టాలెక్కాల్సి వుంది. ఇవే కాకుండా సుకుమార్ డైరెక్ష‌న్ లో ఓ మూవీ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.

బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా వున్న మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్ట‌ర్స్ వెంట‌ప‌డుతున్నారు. గ‌తంలో ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తో సినిమా అంటూ ప్ర‌క‌టించారు. త్ర‌విక్ర‌మ్ చేయి ప‌ట్టుకుని మ‌రీ సినిమా చేస్తున్నాం అనిపించారు. ఇదే త‌ర‌హాలో `స‌రైనోడు` ఈవెంట్ లోనూ బోయ‌పాటి శ్రీ‌నుతో సినిమా అంటూ చెప్పుకొచ్చారు. ఈ రెండు చిత్రాలు ఇప్ప‌టికీ ప‌ట్టాలెక్క‌లేదు స‌రిక‌దా వీటికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా రాలేదు.

ముందు త్రివిక్ర‌మ్‌, బోయ‌పాటి శ్రీ‌నుల క‌ల‌యిక‌లో చిరు సినిమా అన‌గానే అభిమానులు భారీ స్థాయిలో ఊహించుకున్నారు.. కానీ ఈ రెండు ప్రాజెక్ట్ ల నుంచి ఎలాంటి అప్ డేట్ కానీ రాక‌పోవ‌డంతో ఉసూరుమ‌న్నారు. తాజాగా చిరు క‌న్ను ద‌ర్శ‌క‌ధీరుడిపై ప‌డిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. `ఆచార్య‌` ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం హైద‌రాబాద్ లోని యూస‌ఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జ‌ర‌గ‌బోతోంది. ఈ కార్య‌క్ర‌మానికి ఛీఫ్ గెస్ట్ గా రాజ‌మౌళి రాబోతున్నారు.

ఇదే వేదిక‌పై రాజ‌మౌళితో సినిమాని చిరు ప్ర‌క‌టించ‌బోతున్నార‌ని చెబుతున్నారు. ప్ర‌క‌టించ‌డం వ‌ర‌కు ఓకే కానీ స్టార్ డైరెక్ట‌ర్ ల‌తో చిరు ప్ర‌క‌టించిన ఒక్క ప్రాజెక్ట్ కూడా ప‌ట్టాలెక్క‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఒక వేళ రాజ‌మౌళి సై అన్నా ఆయ‌న‌తో సినిమా చేయాలంటే మ‌రో మూడేళ్ల వ‌ర‌కు వేచి చూడాల్సిందే. `ట్రిపుల్ ఆర్‌` త‌రువాత రాజ‌మౌళి సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో సినిమాకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన క‌థాచ‌ర్చ‌లు ఇటీవ‌లే ఫైన‌ల్ అయిన‌ట్టు జ‌క్క‌న్న క్లారిటీ ఇచ్చేశారు కూడా. అయితే ఇమ్మీడియ‌ట్ గా మాత్రం ఈ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించ‌డానికి ఆయ‌న సిద్ధంగా లేరు. కొంత విశ్రాంతి తీసుకున్న త‌రువాతే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ‌తార‌ట‌.

ఈ లోగా త్రివిక్ర‌మ్ తో చేస్తున్న సినిమాని మ‌హేష్ పూర్తి చేసి జ‌క్క‌న్న సినిమాకు రెడీ అవుతారు. ఇదంతా జ‌రగ‌డానికి మ‌రో మూడేళ్ల స‌మ‌యం అయినా ప‌డుతుంది. ఆ త‌రువాత జ‌క్క‌న్న సినిమా రేంజ్‌, బ‌డ్జెట్ లెక్క‌లు వేసుకున్న త‌రువాత సినిమా కార్య‌రూపం దాల్చ‌డం క‌ష్ట‌మే అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. చిరు అనిపిస్తున్నారు.. స్టార్ డైరెక్ట‌ర్స్ మ‌మా అంటున్నారు అని మ‌రో వ‌ర్గం అంటోంది. చిరు ఇంటెన్ష‌న్ ఏంటీ? .. ఎందుకు స్టార్ డైరెక్ట‌ర్ల వెంట ప‌డుతున్నారు. .. త‌న‌కు తానే వారిచేత ప్రాజెక్ట్ లు ఎందుకు ప్ర‌క‌టిస్తున్నారు? అవెందుకు కార్య‌రూపం దాల్చ‌డం లేద‌న్న‌ది ఇప్ప‌డు అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.