Begin typing your search above and press return to search.

క‌ర‌ణ్ జోహార్ ట్వీట్ వెన‌కున్న మ‌ర్మ‌మేంటీ?

By:  Tupaki Desk   |   7 Jun 2022 2:30 PM GMT
క‌ర‌ణ్ జోహార్ ట్వీట్ వెన‌కున్న మ‌ర్మ‌మేంటీ?
X
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్ ఇటీవ‌ల త‌న 50 వ పుట్టిన రోజు వేడుక‌ల్ని ముంబైలోని ఘ‌నంగా జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. ఈ బ‌ర్త్ డే పార్టీకి బాలీవుడ్ మొత్తం త‌ర‌లి వ‌చ్చింది. షారుక్ ఖాన్ నుంచి షాహీద్ క‌పూర్ వ‌ర‌కు.. ఐశ్వ‌ర్యా రాయ్‌ నుంచి మ‌లైకా అరోరా వ‌ర‌కు దాదాపు 50 మంది సెల‌బ్రిటీలు ఈ పార్టీలో పాల్గొన్నారు. వీరితో క‌లిసి క‌ర‌ణ్ జోహార్ నానా హంగామా చేశారు. క‌ర‌ణ్ తో ర‌ణ్ వీర్ సింగ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప‌బ్ లో స్టేజ్ పైకి చేరి ర‌ణ్ వీర్ స్టెప్పులేస్తూ పాత పాట‌ల‌కు హ‌ల్ చ‌ల్ చేశాడు.

అయితే ఈ పార్టీలో 'లైగ‌ర్‌' టీమ్ నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాథ్, చార్మి పాల్గొన్నారు. వీరు త‌ప్ప సౌత్ నుంచి మ‌రెవ‌రికీ క‌ర‌ణ్ ఆహ్వానం పంప‌క పోవ‌డంతో ట్రిపుల్ ఆర్ టీమ్‌, ప్ర‌భాస్ .. వీళ్లెవ‌రూ క‌ర‌ణ్ జోహార్ పార్టీలో క‌నిపించ‌లేదు. మ‌రీ ముఖ్యంగా ఈ పార్టీలో హీరో రానా కూడా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా వుంటే ఇంత వ‌ర‌కు ఏ సౌత్ మూవీ గురించి స్పందించ‌ని క‌ర‌ణ్‌ జోహార్ తాజాగా 'విరాట‌ప‌ర్వం' ట్రైల‌ర్ తో పాటు రానా, సాయి ప‌ల్ల‌విల‌పై సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించడం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ట్రైల‌ర్ ని షేర్ చేసిన క‌ర‌ణ్ జోహార్ 'రానా లుక్ ఫెంటాస్టింక్‌ గా వుంద‌ని, ఈ సినిమా చూడటానికి వేచి వుండ‌లేని, ఇంటెన్స్ రా అండ్ రివైటింగ్ .. మీరు సూప‌ర్' అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా తాను సాయి ప‌ల్ల‌వికి వీరాభిమానిని అంటూ షాకిచ్చారు.

ఇంత వ‌ర‌కు ఏ సౌత్ సినిమా గురించి ట్వీట్ చేయ‌ని క‌ర‌ణ్‌ 'విరాట‌ప‌ర్వం' ట్రైల‌ర్ పై ప్ర‌త్యేకంగా స్పందించ‌డ‌మే కాకుండా సాయి ప‌ల్ల‌వికి తాను వీరాభిమానిని అంటూ ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

రానా హీరోగా సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టించిన తాజా చిత్రం 'విరాట‌ప‌ర్వం'. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో ఎస్ ఎల్ వీ సినిమాస్ బ్యాన‌ర్ పై డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో సుధాక‌ర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. గ‌త కొంత కాలంగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కు జూన్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఏడాది కాలంగా రిలీజ్ విష‌యంలో సందిగ్థ‌త నెల‌కొని వున్న నేప‌థ్యంలో సినిమా రిలీజ్ ని ప్ర‌క‌టించిన టీమ్ క్లారిటీ ఇచ్చేశారు.

అయితే ఈ మూవీపై క‌ర‌ణ్ జోహార్ స్పందించ‌డ‌మే ఇప్ప‌డు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈమూవీని హిందీలో రిలీజ్ చేస్తున్నామంటూ మేక‌ర్స్ ఇంత వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. ఈ నేప‌థ్యంలో క‌ర‌ణ్ జోహార్ ఈ మూవీ ట్రైల‌ర్ పై స్పందించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో క‌ర‌ణ్‌ జోహార్ ట్వీట్ వెన‌కున్న మ‌ర్మ‌మేంటి? అనే చ‌ర్చ మొద‌లైంది. ఈ మూవీని క‌ర‌ణ్‌ హిందీలో రిలీజ్ చేయాల‌నుకుంటున్నారా? లేక రిలీజ్ చేయబోతున్నారా? అన్న‌ది ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేప‌థ్యంలో 'విరాట‌ప‌ర్వం' హిందీ రిలీజ్ కి సంబంధించిన అధికారిక వార్త రానుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.