Begin typing your search above and press return to search.

క్రేజీ బేనర్లో త్రివిక్రమ్, పవన్ సినిమా

By:  Tupaki Desk   |   5 Dec 2015 1:01 PM GMT
క్రేజీ బేనర్లో త్రివిక్రమ్, పవన్ సినిమా
X
టాలీవుడ్ లో మాంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్-హీరో కాంబినేషన్ లలో త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ లది ఒకటి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చి ‘జల్సా’ భారీ కలెక్షన్లు సాధిస్తే.. ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పింది. మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది కానీ.. ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చట్లేదు. ఈ లోపు ఇద్దరు వారి వారి కమిట్ మెంట్ లతో బిజీ అయిపోయారు. ఐతే వచ్చే ఏడాదో ఆ తర్వాతి ఏడాదో ఇద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా రావడమైతే ఖాయం. ఈ సినిమాను నిర్మించే అవకాశం మైత్రి మూవీస్ వాళ్లకు దక్కినట్లు సమాచారం.

‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీస్ అధినేతలు.. ప్రస్తుతం తమ ఫస్ట్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలోనే ఎన్టీఆర్ హీరోగా‘జనతా గ్యారేజ్’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ లో సినిమా తీయడానికి ఇద్దరి నుంచి హామీ తీసుకున్నారట. పవన్ - త్రివిక్రమ్ ఇద్దరూ కూడా ఈ బేనర్ లో పని చేయడానికి ఆసక్తిగానే ఉన్నట్లు తెలిసింది. కాకపోతే ఈ సినిమా మైత్రీ మూవీస్ వాళ్ల బేనర్ లో మూడో సినిమాగా తెరకెక్కుతుందా లేదా అనేది మాత్రం చెప్పలేం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ తో సినిమా అంటే అంత ఈజీ వ్యవహారం కాదు. ఆయనకు ఇప్పటికే మూడు నాలుగు కమిట్ మెంట్ లున్నాయి. వాటన్నింటినీ పక్కనబెట్టి మైత్రీ వాళ్లకే తన తర్వాతి సినిమా చేస్తాడా అన్నది డౌటు.