Begin typing your search above and press return to search.

శ్రీవారికి మొక్కు చెల్లించుకున్న నమ్రత!

By:  Tupaki Desk   |   21 Sep 2016 1:15 PM GMT
శ్రీవారికి మొక్కు చెల్లించుకున్న నమ్రత!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత.. కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుమారుడు గౌతమ్‌ - కుమార్తె సితారతో కలసి స్వామి దర్శనానికి వెళ్లిన నమ్రత.. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి - తలనీలాలు అర్పించి మొక్కు తీర్చుకున్నారు. తర్వాత వారికి ఆలయ అర్చకులు ఆశీర్వాదాలు అందించగా - ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలనను అందజేశారు.

ఈ సందర్భంగా కొండపై నమ్రతను గమనించిన మహేష్ బాబు అభిమానులు నమ్రతతో ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే.. అప్పటికే శ్రీవారికి తలనీలాలు సమర్పించడంతో వారితో ఫొటోలు దిగేందుకు నమ్రత కాస్త ఇబ్బంది పడ్డారు. చున్నీతో తలను కవర్ చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇదే సమయంలో దర్శకుడు మెహర్ రమేష్ కూడా స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. త్వరలో మహేష్‌బాబు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నేషనల్‌ బ్రాండ్‌ కు సంబంధించిన యాడ్‌ చిత్రీకరణకు మెహర్‌ రమేష్ దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా - మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గత ఇరవై రోజులుగా చెన్నైలోని ఇవిపి వరల్డ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.