Begin typing your search above and press return to search.

గొప్ప మ‌న‌సు చాటుకున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌!

By:  Tupaki Desk   |   16 Jan 2023 6:30 AM GMT
గొప్ప మ‌న‌సు చాటుకున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌!
X
మ‌న టాలీవుడ్ హీరోలు వెండితెర‌పైనే కాదు రియ‌ల్ లైఫ్ లోనూ హీరోలే. ఈ విష‌యాన్ని ప‌లు సంద‌ర్భాల్లోనూ నిరూపించారు కూడా. ఇప్ప‌టికీ త‌మ పేరు బ‌య‌ట‌కి రాకుండా, ప‌బ్లిసిటీకి దూరంగా ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ త‌మ స‌హృద‌య‌త‌ను చాటుకుంటున్నారు. మ‌హేష్ బాబు వేయి మందికి పైగా చిన్నారుల‌కు హార్ట్ ఆప‌రేష‌న్ చేయించి త‌న గొప్ప మ‌న‌సుని చాటుకుంటూ ఇప్ప‌టికీ త‌న వంతుగా స‌హాయం చేస్తూనే వున్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ ద్వారా స‌హాయం చేస్తున్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ను చేసే స‌హాయం బ‌య‌టికి తెలియ‌నివ్వ‌డం లేదు. కానీ త‌ను తోచిన స‌హాయాన్ని మాత్రం కంటిన్యూ చేస్తూనే వున్నారు. ఇక యంగ్ హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా కోవిడ్ నుంచి త‌న‌దైన పంథాలో మిడిల్ క్లాస్ కి స‌హాయం చేస్తూ త‌న గొప్ప మ‌న‌సుని చాటుకుంటున్నారు. ఇక అగ్ర క‌థానాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ కూడా త‌న వంతుగా ఎంతో మందికి స‌హ‌య‌ప‌డుతున్నారు. త‌న త‌ల్లి బ‌స‌వ‌తార‌కం పేరు మీద నెల‌కొల్పిన క్యాన్స‌ర్ హాస్పిటల్ ద్వారా సేవ చేస్తున్నారు.

ఎంతో మందికి డ‌బ్బు లేకుండా ఆప‌రేష‌న్ లు, క్యాన్సర్ చికిత్స‌లు చేయిస్తున్నారు. డ‌బ్బులు కూడా ఇస్తూ త‌న గొప్ప మ‌న‌సును చాటుకుంటున్నారు. రీసెంట్ గా క్యాన్సర్ కి గురైన ఓ అమ్మాయికి త‌న సొంత ఖ‌ర్చుల‌తో వైద్యం చేయించిన బాల‌కృష్ణ త‌ను హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె టాక్ షో ప్ర‌భాస్‌, గోపీచంద్ ల ఎపిసోడ్ కు త‌న‌ని, త‌న ఫ్యామిలీని ఆహ్వానించి వేదిక‌గా సాక్షిగా మ‌రి కొంత మొత్తాన్ని అందించిన స‌హృద‌య‌త‌ను చాటుకున్నారు.

త‌న చుట్టూ వున్న ఆళ్ల‌పై, అభిమానుల‌పై బాల‌య్య ఫైర్ అవుతాడ‌నే టాక్ వుంది. అది బాల‌య్య‌లోని ఓ కోణం మాత్ర‌మే. త‌న‌ స‌హాయం అర్థించ‌క‌పోయినా ఆప‌ద‌లో వున్న వారి గురించి తెలుసుకుని బాల‌య్య స్పందిస్తుంటారు. ఆ కుటుంబానికి ఆర్థ‌కంగా అండ‌గా వుంటున్నారు. రీసెంట్ గా మ‌రోసారి బాల‌కృష్ణ త‌న గొప్ప మ‌న‌సుని చాటుకుని అందిరి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అనంత‌పురంకు చెందిన ఓ అమ్మాయి ఇంట‌ర్ చ‌దువుతూ బోన్ క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతోంది.

త‌న ట్రీట్మెంట్ కోసం డాక్ట‌ర్లు రూ. 10 ల‌క్ష‌లు ఖ‌ర్చ‌వుతుంద‌ని చెప్పార‌ట‌. వారి ఆర్ధిక స్తోమ‌త అంతంత మాత్రంగానే వుండ‌టంతో పాప‌కు చికిత్స చేయించ‌లేక‌పోతున్నార‌ట‌. ఈ విష‌యం తెలుకున్న నంద‌మూరి బాల‌కృష్ణ వెంట‌నే వారికి ఫోన్ చేశార‌ట‌. విష‌యం తెలుసుకుని పాప ట్రీట్మెంట్ కోసం డాక్ట‌ర్ల‌తో మాట్లాడి వెంట‌నే ట్రీట్మెంట్ ని మొద‌లు పెట్టించార‌ట బాల‌య్య‌. ఈ విష‌యం తెలిసి బాల‌య్య అభిమానులు జై బాల‌య్య అంటూ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.