Begin typing your search above and press return to search.
నందమూరి హీరో మూవీ ఇంట్రెస్టింగ్ అప్ డేట్
By: Tupaki Desk | 4 April 2021 4:48 AM GMTనందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా చిత్రం తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈయన టాలీవుడ్ లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ గా గుర్తింపు దక్కించుకున్న మైత్రి మూవీ మేకర్స్ వారి బ్యానర్ లో నటిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రి వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంచి కథలను ఎంపిక చేసుకుని సినిమాలను నిర్మించే మైత్రి వారు కళ్యాణ్ రామ్ కు ఖచ్చితంగా సక్సెస్ ను ఇస్తారని నందమూరి అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో రెండు ఎలిమెంట్స్ సినిమాను ఖచ్చితంగా సక్సెస్ చేస్తాయనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
సినిమా ఇంటర్వెల్ సమయంలో వచ్చే కళ్యాణ్ రామ్ రెండవ పాత్ర మొత్తం సినిమా కథను ట్విస్ట్ చేసే విధంగా ఉండటంతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక కళ్యాణ్ రామ్ ఈ సినిమాలోని లుక్ కూడా చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ రెండు ఎలిమెంట్స్ వల్ల సినిమా తప్పకుండా అభిమానులతో పాటు ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకంను మైత్రి వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను మైత్రి వారు అతి త్వరలోనే వెళ్లడించే అవకాశం ఉంది. సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేసేలా వారు ప్లాన్ చేస్తున్నారట. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సినిమా ఇంటర్వెల్ సమయంలో వచ్చే కళ్యాణ్ రామ్ రెండవ పాత్ర మొత్తం సినిమా కథను ట్విస్ట్ చేసే విధంగా ఉండటంతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక కళ్యాణ్ రామ్ ఈ సినిమాలోని లుక్ కూడా చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ రెండు ఎలిమెంట్స్ వల్ల సినిమా తప్పకుండా అభిమానులతో పాటు ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకంను మైత్రి వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను మైత్రి వారు అతి త్వరలోనే వెళ్లడించే అవకాశం ఉంది. సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేసేలా వారు ప్లాన్ చేస్తున్నారట. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.