Begin typing your search above and press return to search.

క్రేజీ కాంబోలో ఐకాన్ స్టార్ మూవీ

By:  Tupaki Desk   |   10 April 2022 2:30 AM GMT
క్రేజీ కాంబోలో ఐకాన్ స్టార్ మూవీ
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇంత‌కు ముందొక లెక్క‌డ ఇప్పుడొక లెక్క‌. `పుష్ప ది రైజ్‌`కి ముందు బ‌న్నీ క్రేజ్ ఓ లెవెల్ కానీ ఈ మూవీ రిలీజ్ త‌రువాత ఆ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ కి చేరిపోయింది. గ‌త ఏడాది విడుద‌లైన ఈ మూవీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ విజ‌న్‌, అల్లు అర్జున్ ప‌ర్ఫెక్ష‌న్.. టెక్నీషియ‌న్ ల స‌పోర్ట్‌.. మేక‌ర్స్ అన్ కాంప్ర‌మైజ్డ్ బ‌డ్జెట్ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ ని చేసి బ‌న్నీని పాన్ ఇండియా స్టార్ గా నిల‌బెట్టింది.

దీంతో బ‌న్నీ రేంజ్ ఒక్క‌సారిగా మారిపోయింది. రీసెంట్ గా బ‌ర్త్ డే జ‌రుపుకున్న బ‌న్నీకి ఈ ఏడాది కెరీర్ లో అత్యంత స్పెష‌ల్ ఇయ‌ర్ అని చెప్పాలి. ` ఇండ‌స్ట్రీ హిట్ ఒక్క‌టి లేదే అని ఫీలైన బ‌న్నీ 2020 లో `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్ ని సొంతం చేసుకుని స‌రికొత్త రికార్డుని సాధించాడు. ఇక గ‌త ఏడాది `పుష్ప‌`తో పాన్ ఇండియా స్టార్ క‌ల నెర‌వేర‌డం.. ఈ ఏడాది పాన్ ఇండియా స్టార్ గా పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకోవ‌డంతో 2022 బ‌న్నీకి మోస్ట్ మెమ‌ర‌బుల్ ఇయ‌ర్ గా నిలిచిపోయింది.

బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దీంతో వారికి పుట్ఇన రోజు సంద‌ర్భంగా బ‌న్నీ ప‌ర్ ఫెక్ట్ ట్రీట్ ని ప్లాన్ చేశాడు. త్వ‌ర‌లో `పుష్ప ది రైజ్‌` కి సీక్వెల్ గా తెర‌పైకి రానున్న `పుష్ప ది రూల్‌` కోసం రెడీ అవుతున్న బ‌న్నీ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ప‌లు క్రేజీ ప్రాజెక్ట్ ల‌ని ప్ర‌క‌టించేశాడు.  `పుష్ప 2` మే లో కానీ జూన్ లో కానీ సెట్స్ పైకి వెళ్ల‌బోతోంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ త‌రువాత ఇదే ఏడాది మ‌రో క్రేజీ మూవీని చేయ‌బోతున్నాడ‌ట‌.

త‌న‌కు `రేసుగుర్రం` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందించిన స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో త‌న త‌దుప‌రి చిత్రాన్ని బ‌న్నీ చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో ఈ చిత్రానికి సంబంధించిన చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. సురేంద‌ర్ రెడ్డి - బ‌న్నీల క‌ల‌యిక‌లో వ‌చ్చిన `రేసు గుర్రం` బ‌న్నీకి ఏరేంజ్ హిట్ ని అందించిందో అంద‌రికి తెలిసిందే.

మ‌రో సారి వీరిద్ద‌రు క‌లిసి వ‌ర్క్ చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వ‌నిపిస్తుండ‌టంతో బ‌న్నీ ఫ్యాన్స్ మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ గ్యారెంటీ అని హ్యాపీగా ఫీల‌వుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం అఖిల్ అక్కినేని తో సురేంద‌ర్ రెడ్డి `ఏజెంట్‌` పేరుతో స్పై థ్రిల్ల‌ర్ ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి న‌టిస్తున్న ఈ మూవీ ని ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ ఆగ‌స్టు 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.