Begin typing your search above and press return to search.

క‌మ‌ర్షియ‌ల్ యాడ్ కోసం చిరు షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌

By:  Tupaki Desk   |   4 April 2022 1:30 PM GMT
క‌మ‌ర్షియ‌ల్ యాడ్ కోసం చిరు షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌
X
మ‌న స్టార్ హీరోలు, హీరోయిన్ లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు సినిమాల్లో బిజీగా వుంటూనే వరుస క్రేజీ క‌మ‌ర్ష‌యిల్ యాడ్ ల‌లో న‌టిస్తూ రెండు చేతులా సంపాదించేస్తున్నారు. సినిమాల‌తో పోలిస్తే క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ లో న‌టించ‌డం వ‌ల్లే మ‌న స్టార్ లు భారీగా సంపాదించేస్తున్నారు. రెండు మూడు రోజుల యాడ్ షూటింగ్ కి మ‌న వాళ్లు చార్జ్ చేస్తున్న పారితోషికం ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారుతోంది. మ‌న వాళ్లు డిమాండ్ ని బ‌ట్టి పారితోషికాన్ని కోట్ల‌ల్లో డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవ‌ల క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ విష‌యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, స‌మంత జోరు పెంచేసి మిగ‌తా వారికి షాకులిస్తున్నారు. బ‌న్నీ ఏ చిన్న క‌మ‌ర్షియ‌ల్ ని కూడా వ‌ద‌ల‌కుండా చేసేస్తూ భారీగానే వ‌సూలు చేస్తున్నాడు. ఇక తాజాగా ఈ రేసులోకి మెగాస్టార్ చిరంజీవి కూడా ఎంట‌ర‌య్యారు. గ‌తంలో థ‌మ్స్ అప్ యాడ్ లో న‌టించి రికార్డు సృష్టించిన మెగాస్టార్ ఆ త‌రువాత మ‌రో యాడ్ లో న‌టించ‌లేదు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఓ రియ‌ల్ ఎస్టేట్ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ లో న‌టించారు.

ఖుష్బూ, అన‌సూయ తో క‌లిసి మెగాస్టార్ ఈ రియ‌ల్ ఎస్టేట్ క‌మ‌ర్షియ‌ల్ లో సంద‌డి చేశారు. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ యాడ్ ఫిల్మ్ కు ద‌ర్వ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌స్తుతం ఈ యాడ్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ యాడ్ లో చిరు మ‌రింత యంగ్ గా క‌నిపించ‌డంతో అభిమానుల ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో ఈ యాడ్ ఫిల్మ్ లో న‌టించ‌డానికి మెగాస్టార్ ఎంత ఛార్జ్ చేశార‌న్న‌ది ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది.

గ‌తంలో భారీ స్థాయి రెమ్యున‌రేష‌న్స్ లేని స‌మ‌యంలోనే భారీ మొత్తాన్ని అందుకున్న మెగాస్టార్ తాజాగా న‌టించిన రియ‌ల్ ఎస్టేట్ యాడ్ కోసం ఎంత తీసుకుని వుంటార‌ని అభిమానుల్లో ప్ర‌స్తుతం చ‌ర్చ న‌డుస్తోంది. తాజాగా అస‌లు విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. ఈ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ కోసం మెగాస్టార్ 7 కోట్లు తీసుకుర‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో యాడ్ ఫిల్మ్స్ లో న‌టించిన ఏ హీరో కూడా ఈ స్థాయిలో పారితోషికం తీసుకోలేద‌ని, ఈ స్థాయిలో ఓ రియ‌ల్ ఎస్టేట్ యాడ్ కు రెమ్యున‌ప‌రేష‌న్ అందుకోవ‌డం ఇదే తొలిసారి అని చెబుతున్నారు.

చిరుతో పాటు న‌టించిన అన‌సూయ కూడా భారీగానే రెమ్యున‌రేష‌న్ ని సొంతం చేసుకుంద‌ని, ఇక చిరు ప‌క్క‌న ఈ యాడ్ లో న‌టించిన ఖుష్బూ కూడా భారీగానే ద‌క్కించుకుంద‌ని చెబుతున్నారు. ఇదిలా వుంటే మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించిన `ఆచార్య‌` చిత్రం ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్ లుగా న‌టించారు. మెగా ఫ్యాన్స్ భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి.