Begin typing your search above and press return to search.

సింహాచ‌లంలో కేజీఎఫ్..మొక్కు తీర్చుకున్న య‌శ్!

By:  Tupaki Desk   |   11 April 2022 12:30 PM GMT
సింహాచ‌లంలో కేజీఎఫ్..మొక్కు తీర్చుకున్న య‌శ్!
X
క‌న్న‌డ రాక్ స్టార్ య‌శ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `కేజీఎఫ్‌-2` ఏప్రిల్ 14న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా కేట‌గిరి చిత్రంగా ప్రేకుకుల ముందుకొస్తున్న సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలతో అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. మ‌రోవైపు టీమ్ పెద్ద ఎత్తున ప్ర‌మోట్ చేస్తోంది.

`కేజీఎఫ్` స‌క్సె స్ ని దృష్టిలో పెట్టుకుని అన్ని మేజ‌ర్ సిటీస్ ని య‌నిట్ ప్ర‌చారంతో క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. `కేజీఎఫ్ -2` స‌క్సెస్ త‌ర్వాత యశ్-ప్ర‌శాంత్ నీల్ ద్వ‌యం క్రేజ్ మ‌రింత రెట్టింపు అవుతుంద‌ని అంచ‌నాలున్నాయి. తాజాగా హీరో య‌శ్ విశాఖ‌ప‌ట్ట‌ణం సింహాచలంలోని సింహాద్రి అప్ప‌న్న స్వామి దేవాల‌యాన్ని సంద‌ర్శించారు. మొక్కుబడిలో భాగంగా ముడుపు క‌ట్టి మొక్కు తీర్చారు. అనంతరం స్వామి వారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది.

వాటికి సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట వైర‌ల్ గా మారాయి. `కేజీఎఫ్ -`2 రిలీజ్ కి ముందు య‌శ్ ఇలా మొక్కు తీర్చ‌డం ఆస‌క్తిక‌రం. సాధార‌ణంగా హీరోలు సినిమాలు స‌క్సెస్ అయిన అనంత‌రం మొక్కులు తీర్చ‌డానికి తిరుపతి..వైజాగ్ త‌దిత‌ర దేవాల‌యాల‌కు వెళ్తుంటారు. కానీ య‌శ్ మాత్రం వాళ్ల‌కి భిన్నం.

సినిమా స‌క్సెస్ కావాల‌ని ముందుగానే మొక్కు చెల్లించిన‌ట్లు క‌నిపిస్తుంది. ఎలాంటి హ‌డావుడి లేకుండా చాలా నిరాడంబ‌రంగా గుడి వ‌ద్ద‌కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆల‌య సిబ్బంది ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసి ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. య‌శ్ కి తెలుగు రాష్ర్టాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. `కేజీఎఫ్` అనే ఒకే ఒక్క స‌క్సెస్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఏకైక న‌టుడిగా చెప్పొచ్చు. `కేజీఎఫ్` వైజాగ్ ఏరియాలో భారీ వ‌సూళ్ల‌ని సాధించ‌డం విశేషం. స‌క్సెస్ మీట్ లో భాగంగా అప్ప‌ట్లో విశాఖ‌ని య‌శ్ ప‌ర్య‌టించారు.