Begin typing your search above and press return to search.

పూరి డ్రీమ్‌ ప్రాజెక్ట్ ని ప‌వ‌న్ - మ‌హేష్‌ ఎందుకు ప‌క్క‌న పెట్టారు?

By:  Tupaki Desk   |   30 March 2022 7:31 AM GMT
పూరి డ్రీమ్‌ ప్రాజెక్ట్ ని ప‌వ‌న్ - మ‌హేష్‌ ఎందుకు ప‌క్క‌న పెట్టారు?
X
టాలీవుడ్ లో వున్న అత్యంత క్రేజీ డైరెక్ట‌ర్ ల‌లో పూరి జ‌గ‌న్నాథ్ ఒక‌రు. ఆయ‌న హీరో పాత్ర‌ల‌ని తెర‌పై ఆవిష్క‌రించే తీరంటే ప్ర‌తీ హీరోకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతో పూరి డైరెక్ష‌న్ లో ఒక్క సినిమా అయినా చేయాల‌ని స్టార్ హీరోలు సైతం భావిస్తుంటారు. అయితే ఇద్ద‌రు క్రేజీ స్టార్ లు మాత్రం పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపించ‌క‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ ఇద్ద‌రు క్రేజీ స్టార్స్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, సూపర్ స్టార్ మ‌హేష్ బాబు.

పూరి జ‌గ‌న్నాథ్ గ‌త కొంత కాలంగా త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ `జ‌న గ‌ణ మ‌న‌`ని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్రయ‌త్నాలు చేస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో వ‌రుస‌గా ఫ్లాపులు చూశారు. అదే స‌మ‌యంలో త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `జ‌న గ‌ణ మ‌న‌`ని ముందు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో చేయాల‌నుకున్నారు. `బిజినెస్ మెన్ ` మూవీ టూమ్ లోనే ఈ చిత్ర క‌థ గురించి, ఇందులో మ‌హేష్ పాత్ర గురించి చెప్పి స‌ర్ ప్రైజ్ చేశారు. ఈ చిత్రంలో హీరో పాత్ర చాలా ప‌వ‌ర్ ఫుల్ గా వుంటుంద‌ని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ మూవీ త‌రువాత పూరి కెరీర్ కాస్త డ‌ల్ అయింది. ఈ టైమ్ లో పూరితో సినిమా ఎందుక‌ని మ‌హేష్ అనుకున్నారో ఏమో తెలియ‌దు కానీ ఈ ప్రాజెక్ట్ ముందుకు క‌ద‌ల‌లేదు. ఆ తరువాత పూరి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో `కెమెరామెన్ గంగ‌తో రాంబాబు` మూవీ చేశారు. ఈ మూవీ అప్ప‌ట్లో ఓ వ‌ర్గాన్ని టార్గెట్ చేసింద‌ని వివాదం మొదలైంది. ఆ త‌రువాత మ‌ళ్లీ పూరి వ‌రుస ఫ్లాపుల్ని ఎదుర్కొన్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కాస్తా ప‌క్క‌న ప‌డింది. `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` రిలీజ్ త‌రువాత పూరి త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ ని క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ తో చేయ‌బోతున్నారంటూ వార్త‌లు షికారు చేశాయి.

కానీ అది కూడా జ‌ర‌గ‌లేదు. దీనిపై ఎలాంటి అప్ డేట్ బ‌య‌టికి రాలేదు. ఇక పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ప‌క్క‌న పెట్టిన‌ట్టే అంటూ వార్త‌లు వినిపించాయి. దీనిపై స్పందించిన పూరి `జ‌న గ‌ణ మ‌న‌` ఖ‌చ్చింత‌గా వుంటుంద‌ని క్లారిటీ ఇచ్చాడు. ఆ త‌రువాత మ‌రోసారి మ‌హేష్ .. పూరితో సినిమాపై స్పందించడంతో మ‌ళ్లీ ఈ ప్రాజెక్ట్ పై ఆశ‌లు చిగురించాయి. కానీ మ‌ధ్య‌లో ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ ఈ ప్రాజెక్ట్ లోకి రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌చ్చేసి స‌డ‌న్ షాకిచ్చాడు. ఈ మంగ‌ళ‌వారం ముంబైలో `జ‌న గ‌ణ మ‌న‌` చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు.

వీరితో మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ప్రొడ్యూస‌ర్‌గా చేతులు క‌ల‌ప‌డంతో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎట్ట‌కేల‌కు ప‌ట్టాలెక్కింది. పూరి - విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం `లైగ‌ర్‌` మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈమూవీ చిత్రీక‌ర‌ణ సంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్య మంది బాండింగ్ ఏర్ప‌డింద‌ట‌. అదే `జ‌న గ‌ణ మ‌న‌` ప‌ట్టాలెక్క‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా నిలిచింద‌ని, విజ‌య్ దేవ‌ర‌కొండ క్యాప‌బెలిటీస్ ని గుర్తించి ఎన్నో ఏళ్లుగా త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించాల‌ని ఎదురుచూసిన పూరి ఫైన‌ల్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో తెర‌పైకి తీసుకొస్తుండ‌టం ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ దేశం కోసం ప్రాణాల‌ని సైతం లెక్క‌చేయ‌ని ప‌వ‌ర్ ఫుల్ ఇండియ‌న్ ఆర్మీ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నారు. ఏప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీని వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు 2న ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా వైడ్ గా విడుద‌ల చేయనున్నారు.