Begin typing your search above and press return to search.

`ఆడవాళ్ళు మీకు జోహార్లు` ఓటీటీ రిలీజ్ డేట్ మారింది..!

By:  Tupaki Desk   |   2 April 2022 4:26 AM GMT
`ఆడవాళ్ళు మీకు జోహార్లు` ఓటీటీ రిలీజ్ డేట్ మారింది..!
X
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ న‌టించిన తాజా చిత్ర‌మే `ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు`. కిశోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నేష‌న‌ల్ క్ర‌ష్‌ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. సీనియ‌ర్ న‌టీమ‌ణులు ఖుష్భూ, రాధిక, ఊర్వసి కీలక పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందించారు.

ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 4న గ్రాండ్‌గా విడుద‌లైంది. అయితే భారీ అంచ‌నాల న‌డుమ వ‌చ్చిన ఈ చిత్రం.. ఆ అంచ‌నాల‌ను ఏ మాత్రం అందుకోలేక‌పోయింది. రోటీన్‌ స్టోరీకి కామెడి, ఎమోషన్స్‌ని జోడించి ఈ మూవీని రూపొందించ‌గా.. తొలిరోజే యావ‌రేజ్ టాక్ సొంతం చేసుకుంది. రూ.16.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. లాంగ్ రాన్‌లో కేవ‌లం రూ. 7.72 కోట్ల షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.

దీంతో ఈ సినిమాను కొన్న బయ్యర్లకి భారీ న‌ష్టాలు మిగిలాయి. ఇక‌పోతే క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత థియేట‌ర్స్‌లో విడుద‌లైన సినిమాలు.. మ‌ళ్లీ కొద్ది రోజుల‌కే ఓటీటీ వేదిక‌గా రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే `ఆడవాళ్ళు మీకు జోహార్లు` సినిమా ఉగాది పండ‌గ కానుక‌గా ఏప్రిల్ 2న ప్ర‌ముఖ డిజిట‌ల్ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంద‌ని మొద‌ట ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కానీ, ఇప్పుడా డేట్ మారింది.

ఏప్రిల్ 14న ఈ సినిమాను సోనీ లివ్ లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని తాజాగా స‌ద‌రు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఓ గ్లింప్స్‌ను సైతం బ‌య‌ట‌కు వ‌దిలింది. కాగా, ఇటీవ‌ల కాలంలో కొన్ని చిత్రాలు థియేట‌ర్స్‌లో ఫ్లాప్ అయినా.. ఓటీటీ వేదిక‌గా హిట్ అవుతున్నాయి. అలా `ఆడవాళ్ళు మీకు జోహార్లు` చిత్రం కూడా ఓటీటీలో స‌క్సెస్ అవుతుందేమో చూడాలి.