Begin typing your search above and press return to search.

త‌న నిశ్శ‌బ్దం వ‌ల్ల ప్ర‌పంచం అంతం కాలేదంటోంది

By:  Tupaki Desk   |   16 Jun 2022 1:30 AM GMT
త‌న నిశ్శ‌బ్దం వ‌ల్ల ప్ర‌పంచం అంతం కాలేదంటోంది
X
సెల‌బ్రిటీలు నెట్టింట యాక్టీవ్ గా వుంటూ వ‌రుస అప్ డేట్ ల‌ని త‌మ అభిమానుల‌కు షేర్ చేస్తూ నిత్యం వారితో ట‌చ్ లో వుంటున్నారు. అంద‌రిలాగే మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక కూడా సోష‌ల్ మీడియాలో య‌మ యాక్టీవ్ గా వుంటూ వ‌స్తోంది.

త‌న వెబ్‌సిరీస్ ల‌కు సంబంధించిన పోస్ట్ ల‌తో పాటు త‌న ఫొటో షూట్ ల‌కు సంబంధించిన వీడియోల‌ని, ఫోటోల‌ని అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ వ‌స్తోంది. అయితే గ‌త కొన్ని వారాల క్రితం జ‌రిగిన ఓ సంఘ‌ట‌న కార‌ణంగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయింది.

ఓ వివాదం కార‌ణంగా నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే నిహారిక త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ని రెండు నెల‌ల పాటు డీ యాక్టీవేట్ చేసి కంప్లీట్ గా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. దాదాపు ఎనిమిది వారాల త‌రువాత మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా పోస్ట్ లు పెట్ట‌డం మొద‌లు పెట్టింది. ఈ సంద‌ర్భంగా నిహారిక ఆస‌క్తిక‌రంగా పెట్టిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఈ ఎనిమిది వారాల కాలంలో మూడు పాఠాలు నేర్చుకుంద‌ట‌. `నా ఎనిమిది వారాల ఇన్ స్టాగ్రామ్ విరామం నుంచి నేను నేర్చుకున్న పాఠాలు మూడు. నం. 1.. నేను సోష‌ల్ మీడియాకు దూరంగా వుండ‌టం వ‌ల్ల ప్ర‌పంచం అంతం కాలేదు.

నం.2.. ఇత‌రులు ఏం చేస్తున్నారో ఈ ఖాళీ స‌మ‌యంలో నేను ప‌ట్టించుకోలేదు. నం.3. నేను నిజంగా రిఫ్రెష్ గా వున్నాను. అంతే కాకుండా ఇప్ప‌డు పోస్ట్ చేయ‌డానికి ఉత్సాహంగా వున్నాను` అని ఆస‌క్తిక‌రంగా పోస్ట్ చేసింది.

ఎనిమిది వారాల త‌రువాత నిహారిక పెట్టిన ఈ పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇదిలా వుంటే నిహారిక నిర్మించిన మ‌రో వెబ్ సిరీస్ `హ‌లో వ‌ర‌ల్డ్` జీ 5 లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. పెళ్లి త‌రువాత సినిమాల‌కు గుడ్ బై చెప్పిన నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.