Begin typing your search above and press return to search.

ఆడవాళ్ళు.. ఓ వారం వెనక్కి వెళ్తున్నారా..?

By:  Tupaki Desk   |   19 Feb 2022 8:30 AM GMT
ఆడవాళ్ళు.. ఓ వారం వెనక్కి వెళ్తున్నారా..?
X
శర్వానంద్ - రష్మిక మందన్న జంటగా నటించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ''ఆడవాళ్ళు మీకు జోహార్లు''. తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

మహా శివరాత్రి పండుగను పురష్కరించుకొని ఫిబ్రవరి 25న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు 'ఆడవాళ్లు..' సినిమా ఓ వారం వెనక్కి వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

'భీమ్లా నాయక్' మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో టాలీవుడ్ లో మిగతా విడుదలలో గందరగోళం ఏర్పడింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. అయితే పవన్ సినిమా విడుదలపై సందేహాలు ఉండటంతో శర్వానంద్ సినిమా కోసం ఈ నెల 25ని లాక్ చేశారు.

కానీ ఇప్పుడు 'భీమ్లా నాయక్' చిత్రాన్ని వచ్చే వారం భారీగా స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసారు. దీంతో అదే రోజు వారాలనుకున్న ఇతర సినిమాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో “ఆడవాళ్లు మీకు జోహార్లు” చిత్రాన్ని మార్చి 3వ తేదీకి షిప్ట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అలానే ఏప్రిల్ 8 అని మరో డేట్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే శర్వా టీమ్ మాత్రం ఇంకా అదే డేట్ మీద ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈరోజు ఒక సాంగ్ ని రిలీజ్ చేయడంతో పాటుగా రేపు గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ రెండు రోజుల్లో విడుదల తేదీ మీద అధికారిక ప్రకటన ఇస్తారేమో చూడాలి.

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ ని క్రియేట్ చేసింది. దర్శకుడు కిషోర్ తిరుమల అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించారని తెలుస్తోంది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శర్వానంద్ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.