Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ 30 : సీత కాదు గీత కాదు... వసుమతి ఓకే

By:  Tupaki Desk   |   19 Sep 2022 9:30 AM GMT
ఎన్టీఆర్‌ 30 : సీత కాదు గీత కాదు... వసుమతి ఓకే
X
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబోలో రూపొందబోతున్న సినిమా కోసం రోజుకో వార్త అన్నట్లుగా సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టైటిల్‌ నుండి షూటింగ్‌ ప్రారంభ తేదీ మరియు సినిమా విడుదల తేదీ వరకు ఎన్నో విషయాల గురించి పుకార్లు వస్తూనే ఉన్నాయి. అందులో ప్రధానంగా హీరోయిన్ గురించిన పుకార్లు చాలానే ఉన్నాయి.

ఎన్టీఆర్‌ 30 సినిమా ప్రస్థావనకు వచ్చిన సమయంలో ఆలియా భట్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత జాన్వీ కపూర్ ను రంగంలోకి దించబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. వీరిద్దరు కాకుండా ఇంకా పలువురి పేర్లు ప్రచారం జరిగాయి. గత రెండు మూడు రోజులుగా సీతారామం సినిమాలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేశారంటూ పుకార్లు షికార్లు చేశాయి.

మృణాల్ ఠాకూర్ ఎంపిక దాదాపుగా పూర్తి అయ్యిందంటూ వార్తలు వస్తుండగానే మరో వైపు గీతగోవిందం స్టార్‌ రష్మిక మందన్నా ని హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది.. ఆమె ఏకంగా నాలుగు కోట్ల పారితోషికం డిమాండ్‌ చేసినా కూడా దర్శకుడు కొరటాల శివ ఓకే చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఆర్‌ సీ 15 హీరోయిన్ కియారా అద్వానీని ఎంపిక చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

భరత్‌ అనే నేను సినిమాలో మహేష్ బాబుకు జోడీగా వసుమతి అనే పాత్రలో నటించిన కియారా అద్వానీ తెలుగు లో రెండో సినిమా వినయ విధేయ రామ డిజాస్టర్ అవ్వడంతో బాలీవుడ్‌ లో బిజీ అయ్యింది. మళ్లీ రామ్‌ చరణ్ కి జోడీగా శంకర్ సినిమా తో రీ ఎంట్రీకి సిద్ధం అయ్యింది.

ఇప్పుడు ఎన్టీఆర్ 25 సినిమాకి కూడా ఆమెను హీరోయిన్‌ గా ఎంపిక చేశారని అంటున్నారు. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న హీరోయిన్‌ గా కియారా కి మంచి గుర్తింపు ఉంది. కనుక తప్పకుండా ఎన్టీఆర్‌ 30 సినిమా లో ఆమె ఉండటం మంచిదే అన్నట్లుగా నందమూరి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.