Begin typing your search above and press return to search.

బింబిసార ఈవెంట్ వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్‌ మృతి?

By:  Tupaki Desk   |   30 July 2022 5:38 AM GMT
బింబిసార ఈవెంట్ వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్‌ మృతి?
X
నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా నటించిన బింబిసార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న శిల్ప కళావేదికలో నిర్వహించగా ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరు అయిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ హాజరు అవ్వడంతో ఫ్యాన్స్ భారీ ఎత్తున ఈవెంట్ కు హాజరు అయ్యారు. వర్షం వచ్చినా కూడా పెద్ద సంఖ్యలో శిల్ప కళా వేదిక వద్దకు చేరుకున్నారు.

చాలా మందికి పాస్ లు లేని కారణంగా ఈవెంట్ వేదిక లోనికి వెళ్లనివ్వలేదు. కార్యక్రమం అంతా సాఫీగా సాగింది అనుకుంటూ ఉండగా ఎన్టీఆర్‌ అభిమాని ఒకరు బింబిసార ఈవెంట్‌ వద్ద మృతి చెందినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాడేపల్లి గూడెం కి చెందిన సాయిరామ్‌ కూకట్‌ పల్లిలో ఉంటూ ప్రైవేట్‌ జాబ్‌ చేస్తున్నాడట.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం అతడు శిల్ప కళావేదిక వద్దకు చేరుకున్నాడు. ఏం జరిగిందో ఏమో కానీ అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే సాయి రామ్‌ మృతి చెందినట్లుగా ఆసుపత్రి వర్గాల వారు ప్రకటించారు. ఏం జరిగింది అనేది స్పష్టత రాలేదు. గుండె పోటు వచ్చి అతడు మృతి చెంది ఉండవచ్చు అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

సాయి రామ్ మృతి విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఎన్టీఆర్‌ పదే పదే అభిమానులకు జాగ్రత్తగా రండీ.. జాగ్రత్తగా వెళ్లండి అంటూ విజ్ఞప్తి చేస్తూనే ఉంటాడు. అయినా కూడా ఇలాంటి సంఘటనలు జరగడం బాధకరం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నందమూరి ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు సాయి రామ్‌ మృతి గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. పూర్తి వివరాలు వెళ్లడి అయిన తర్వాత ఎన్టీఆర్‌ స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఆ అభిమాని కుటుంబం ను నందమూరి కుటుంబం ఆదుకోవాలని కూడా కొందరు ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.