Begin typing your search above and press return to search.

పూరీ అక్కడ సిట్టింగ్ వేశాడట

By:  Tupaki Desk   |   22 Sep 2016 5:30 PM GMT
పూరీ అక్కడ సిట్టింగ్ వేశాడట
X
జనతా గ్యారేజ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నెక్ట్స్ ఏ సినిమాను మొదలుపెడతాడు? ఇప్పటికైతే ఈ సంగతి ఇంకా తేలలేదు కానీ.. ఈ రేసులో ఉన్న పూరీ జగన్నాథ్ మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తర్వాతి చిత్రం కోసం నలుగురు డైరెక్టర్లు పోటీ పడుతుంటే.. అందులో పూరీ పేరు ముందు నుంచీ వినిపిస్తోంది.

గతంలోనే పూరీ జగన్నాథ్ చెప్పిన స్టోరీ లైన్ కి ఓకే చెప్పాడు యంగ్ టైగర్. కానీ.. ఇప్పుడు జనతా గ్యారేజ్ తర్వాత చేయబోయే మూవీ విషయంలో రిస్క్ తీసుకునేందుకు జూనియర్ సిద్ధంగా లేడట. అందుకనే ఫుల్ స్క్రిప్ట్ నేరేట్ చేస్తేనే.. పట్టాలెక్కిస్తానని పక్కాగా తేల్చేశాడట. సహజంగా పూరీ ఇలా పూర్తి స్క్రిప్ట్ చెప్పడానికి అంగీకరించడు కానీ.. ప్రస్తుతం సిట్యుయేషన్స్ పూరీకి ఫేవర్ గా లేవు. అందుకే ఎన్టీఆర్ కి చెప్పిన స్టోరీని ఫినిష్ చేసేందుకు గాను.. బ్యాంకాక్ లో మకా వేశాడని తెలుస్తోంది. సాధారణంగా పూరీ అక్కడే తన స్టోరీలన్నీ రాస్తాడు.

ఈనెల 25న హైద్రాబాద్ కి రానున్న పూరీ జగన్నాథ్.. అదే రోజున ఎన్టీఆర్ ని కలిసి బౌండ్ స్క్రిప్ట్ చేతిలో పెట్టి మరీ.. ఫుల్ స్టోరీ నేరేట్ చేస్తాడట. ఆ తర్వాతే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై డిసైడ్ కావాలని ఎన్టీఆర్ కూడా అనుకుంటున్నాడట. మరి ఈ ప్రాజెక్టు సంగతేంటో తెలియాలంటే.. మరో మూడ్రోజులు ఆగాల్సిందే.