Begin typing your search above and press return to search.

NTR30 : జాన్వీ కపూర్ కాదు సీత తో చర్చలు!

By:  Tupaki Desk   |   31 Aug 2022 7:32 AM GMT
NTR30 : జాన్వీ కపూర్ కాదు సీత తో చర్చలు!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివ కాంబోలో రూపొందబోతున్న ఎన్టీఆర్‌ 30 సినిమా గురించి రోజుకో వార్త అన్నట్లుగా సోషల్‌ మీడియాలో మరియు మెయిన్ స్ట్రీమ్‌ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. వార్తలు పుకార్లు సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెంచుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా హీరోయిన్ గురించి ఆసక్తికర చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది.

మొన్నటి వరకు ఈ సినిమా కోసం బాలీవుడ్‌ హీరోయిన్ జాన్వీ కపూర్ తో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. శ్రీదేవి కూతురు అయిన జాన్వీ కపూర్ ఎన్టీఆర్‌ 30 తో టాలీవుడ్‌ లో అడుగు పెడితే కచ్చితంగా ఆమెకు మంచి ఫ్యూచర్ ఉంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా జాన్వీ కపూర్‌ కాదు అంటున్నారు.

ఎన్టీఆర్‌ కి జోడీగా జాన్వీ కపూర్ కాకుండా తాజాగా టాలీవుడ్‌ లో సెన్షేషన్‌ సక్సెస్ ను దక్కించుకున్న బాలీవుడ్‌ ముద్దుగుమ్మ మృనాల్ ఠాకూర్ తో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. తెలుగు లో ఈ అమ్మడికి అనూహ్యంగా క్రేజ్ దక్కింది. ఎలాగూ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు. కనుక మృనాల్‌ బెస్ట్‌ ఛాయిస్‌ అంటున్నారు.

మృనాల్‌ ఠాకూర్ చేసింది తెలుగు లో ఒక్క సినిమానే అయినా కూడా ఆమెకు ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఉత్తర భారతంలో చాలా కాలంగా మృనాల్‌ కి మంచి క్రేజ్ ఉంది. కనుక ఎన్టీఆర్‌ 30 లో ఆమె హీరోయిన్ గా ఎన్టీఆర్‌ కు జోడీగా నటించడం వల్ల అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది అంటూ యూనిట్‌ సభ్యులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇక ఎన్టీఆర్‌ 30 సినిమా షూటింగ్‌ విషయానికి వస్తే ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా కూడా కథ విషయంలో కొన్ని మార్పులు చేసి సినిమాను భారీ ఎత్తున పాన్ ఇండియా రేంజ్ లో రూపొందించేందుకు గాను కాస్త స్క్రీన్‌ ప్లే లో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారట. అందుకే సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతోంది. ఈ ఏడాది చివర్లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.