Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ కు ముద్దు పెట్టి పారిపోయాడట

By:  Tupaki Desk   |   17 Feb 2020 2:00 PM GMT
హీరోయిన్‌ కు ముద్దు పెట్టి పారిపోయాడట
X
ఈమద్య కాలంలో రష్మిక మందన్న మీడియాలో తెగ హడావుడి చేస్తోంది. ఈమె ఇటీవలే సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా సక్సెస్‌ టాక్‌ ను దక్కించుకుంది. ఇక ఈ వారంలో ఈ అమ్మడు భీష్మ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రమోషన్స్‌ కార్యక్రమంలో ఈ అమ్మడు పాల్గొంటుంది. ఇటీవలే తనకు కుక్క బిస్కట్స్‌ ఇష్టం అంటూ చెప్పిన ఈ అమ్మడు మీడియాలో నిలిచింది. ఇప్పుడు మరో వార్తతో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

కర్ణాటకలో ఈ అమ్మడు తన ఇంటి వద్ద ఉండగా కొందరు అభిమానులు ఆమెను కలిసేందుకు వచ్చారట. ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారట. ఆ సమయంలోనే ఒక వ్యక్తి రష్మికతో సెల్ఫీ తీసుకునేందుకు అంటూ ముందుకు వెళ్లి ఏకంగా ఆమె చెంపపై ముద్దు పెట్టాడట. ఆమె షాక్‌ అయ్యి తిరిగి చూసేప్పటి వరకు అతడు అక్కడి నుండి పారిపోయాడట.

హీరోయిన్స్‌ కు ఇలాంటి అనుభవాలు అప్పుడప్పుడు ఎదురవుతూనే ఉన్నాయి. అందుకే అభిమానులతో ఇంట్రాక్షన్‌ సమయంలో చాలా మంది హీరోయిన్స్‌ జాగ్రత్తగా ఉంటున్నారు. రష్మిక మందన్న మాత్రం కాస్త అజాగ్రత్తతో వ్యవహరించడం వల్ల ఆమెను ముద్దు పెట్టి మరీ ఒకడు పారిపోయాడంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.