Begin typing your search above and press return to search.

ఓటీటీ విడుదలకు సిద్ధమైన యాక్షన్ హీరో సినిమా...?

By:  Tupaki Desk   |   19 Jun 2020 1:30 PM GMT
ఓటీటీ విడుదలకు సిద్ధమైన యాక్షన్ హీరో సినిమా...?
X
యాక్షన్ హీరో గోపీచంద్ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట. అయితే గోపీచంద్ ప్రస్తుతం నటిస్తున్న 'సీటీమార్' సినిమా అనుకుంటే పొరపాటే. అప్పుడెప్పుడో రిలీజ్ కి రెడీ అయిన ''ఆరడుగుల బులెట్'' సినిమా ఇప్పుడు ఓటీటీలో రాబోతోందట. డిజిటల్ వరల్డ్ లో ఓటీటీలు ఎంటర్ అయినప్పటి నుండి అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం వీటి వైపే చూస్తున్నారు. కరోనా మహమ్మారి వలన ఓటీటీ ప్లాట్ ఫామ్స్ హవా ఓ రేంజ్ లో ఉంది. ఎంటర్టైన్మెంట్ గురించి ఆలోచన వస్తే ఓటీటీలు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. అందరూ ఈ ఓటీటీలలో వచ్చే సినిమాలు వెబ్ కంటెంట్ చూడటానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట్లోనే కూర్చొని హోమ్ స్క్రీన్ లో ఫ్యామిలీతో సినిమా చూసేయొచ్చు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలా రిలీజ్ కి నోచుకోని సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఓటీటీలతో ఒక రేట్ ఫైనలైజ్ చేసుకొని ఇలా అయినా అంతో ఇంతో నష్టాల నుండి బయటపడొచ్చని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలో గోపీచంద్ నటించిన ''ఆరడుగుల బులెట్'' సినిమా కూడా ఓటీటీలో రావాలని చూస్తోందట.

మాస్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన ''ఆరడుగుల బులెట్'' సినిమాని తాండ్ర రమేష్ నిర్మించారు. 2017లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని అనేక వాయిదాల తర్వాత 2017 జూలై 16న విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ సినిమా విడుదల కాలేదు. ఇప్పటికి మూడేళ్లు అవుతున్నా ఈ సినిమా గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఇప్పుడు ఓటీటీల పుణ్యమా అని ఈ సినిమా బయటకి రాబోతోందట. ఒక ప్రముఖ ఓటీటీ ''ఆరడుగుల బులెట్'' మేకర్స్ అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తం చెల్లించి ఈ సినిమాని తీసుకోడానికి రెడీ అయ్యారట. గోపీచంద్ మాస్ ఇమేజ్.. మాస్ ఆడియన్స్ లో బి. గోపాల్ క్రేజ్.. నయనతార గ్లామర్ ఈ చిత్రానికి వ్యూయర్ షిప్ తెస్తుందని ఓటీటీ వారు అభిప్రాయపడుతున్నారట. మొత్తం మీద మాస్ హీరో గోపీచంద్ - మాస్ మసాలా డైరెక్టర్ బి. గోపాల్ ల కాంబినేషన్ లో సినిమా చూడాలనుకున్న ఫ్యాన్స్ కోరిక ఎట్టకేలకు తీరబోతోందన్నమాట.