Begin typing your search above and press return to search.

సినిమా రిలీజ్ కాకుండానే పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సంపాదించుకున్నాడుగా..!

By:  Tupaki Desk   |   2 Aug 2022 12:30 PM GMT
సినిమా రిలీజ్ కాకుండానే పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సంపాదించుకున్నాడుగా..!
X
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కు తెలుగులో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'అర్జున్ రెడ్డి' తో యూత్ లో మంచి క్రేజ్ ఏర్పరచుకున్న విజయ్D.. తన స్టైలింగ్ మరియు రియల్ లైఫ్ యాటిట్యూడ్ తో యూత్ ఐకాన్ గా మారిపోయాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నాడు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో VD హీరోగా నటించిన సినిమా ''లైగర్''. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ థియేటర్లలలోకి రాబోతోంది. అయితే సినిమా రిలీజ్ అవ్వకుండానే విజయ్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను ఎంజాయ్ చేస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

'లైగర్' టీమ్ ప్రస్తుతం దూకుడుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఇది తన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో విజయ్ దేవరకొండ బీ టౌన్ లో గట్టిగా ప్రచారం చేస్తున్నాడు. తాజాగా ముంబైలోని ఓ షాపింగ్ మాల్ లో ఈవెంట్ నిర్వ‌హిస్తే భారీ సంఖ్యలో నార్త్ జనాలు తరలి వచ్చారు. ఇస‌కేస్తే రాల‌నంత జ‌నం రావడంతో.. తొక్కిసలాట జరుగుతుందేమో అని VD అక్కడి నుంచి కాస్త త్వరగా బయల్దేరాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

విజయ్ దేవరకొండ ను చూడటానికి వచ్చిన జనాలను చూస్తే.. ఇది ముంబైలోనా? హైద‌రాబాద్‌ లోనా? అనే సందేహాలు కలగకమానదు. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఈవెంట్స్ లో టాలీవుడ్ హీరోలను చూడటానికి విపరీతంగా జనం తరలి వస్తుంటారు. పాన్ ఇండియా సినిమాలు చేసిన తర్వాత ప్రభాస్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ వంటి హీరోలకు కూడా నార్త్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.

కానీ ఇక్కడ విజ‌య్ న‌టించిన ఒక్క సినిమా కూడా బాలీవుడ్ లో రిలీజ్ అవ్వలేదు. 'లైగ‌ర్‌' సినిమాతో తొలిసారి నార్త్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. త‌న బాక్సాఫీస్ స్టామినా ఏంటనేది సినిమా విడుదలైతే కానీ తెలియదు. ఇవేమీ జరక్కుండానే VD బీ టౌన్ లో ఇంత క్రేజ్ సంపాదించుకోవడం మామూలు విష‌యం కాదు.

ఇటీవల 'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ మరియు ముంబై నగరాల్లో నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో జరిగిన ఈవెంట్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో.. ముంబైలోనూ అలాంటి స్పందనే రావడం విశేషం. ఈవెంట్ ముగిసిన తర్వాత పెద్ద సంఖ్యలో జనాలు వీడీ ని అనుసరిస్తూ 'రౌడీ రౌడీ' అంటూ స్లొగన్స్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ కనిపించారు.

ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా నిర్వహించారు ఈవెంట్ లో షాపింగ్ మాల్ మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హీరోల ఈవెంట్స్ కి కూడా ఈ రేంజ్ లో క్రౌడ్ ఎక్కడా కనిపించదు. ఒక సౌత్ స్టార్ కు ఇలాంటి క్రేజ్ చూసి బాలీవుడ్ వ‌ర్గాలే ఇప్పుడు ఆశ్చ‌ర్య‌పోతున్నాయి.

'లైగర్' ట్రైలర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో పాటుగా విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కు నార్త్ ఆడియన్స్ కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సింపుల్ గా చెప్పులతో వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. అలానే తన స్పీచ్ తో బీటౌన్ జనాల దృష్టిని ఆకర్షించాడు. ఆదివారం జరిగిన కార్యక్రమంలోనూ తన హిందీ మాటలతో అట్రాక్ట్ చేసాడు.

ఇలాంటివన్నీ సినిమా రిలీజ్ కు ముందే రౌడీ స్టార్ ను బీటౌన్ లో హాట్ టాపిక్ గా మార్చేశాయని చెప్పాలి. ఇప్పుడే ఇలా ఉందంటే.. 'లైగర్' విడుదలై బ్లాక్ బస్టర్ కొడితే.. విజయ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు వెళ్లిపోతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, 'లైగర్' చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు. పూరి కనెక్ట్స్ - ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్ - ఛార్మీ కౌర్ - కరణ్ జోహర్ - అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా విజయ్ కు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.