Begin typing your search above and press return to search.

చోరీ చేసిన ప‌టాస్ క‌మెడియ‌న్!

By:  Tupaki Desk   |   11 April 2018 6:12 AM GMT
చోరీ చేసిన ప‌టాస్ క‌మెడియ‌న్!
X
పాపుల‌ర్ టీవీ షోలో క‌నిపించే క‌మెడియ‌న్ లోని కొత్త కోణాన్ని బ‌య‌ట‌కు తీశారు పోలీసులు. పాపుల‌ర్ టీవీ షో అయిన ప‌టాస్ ద్వారా వెలుగులోకి వ‌చ్చిన ఒక క‌మెడియ‌న్ దొంగ‌త‌నాలు చేస్తాడ‌న్న విష‌యాన్ని గుర్తించారు. అత‌న్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విలాసవంత‌మైన జీవితం కోసం దొంగ‌గా మారిన‌ట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల క‌థ‌నం ప్రకారం బ‌రి నాగ‌రాజు అలియాస్ న‌రేంద‌ర్ ఇందిరాన‌గ‌ర్ నివాసి. ఇంటి నిర్మాణ కార్మికుడిగా ప‌ని చేస్తుండేవాడు. ప‌టాస్ కామెడీ షోలో అత‌నికి అవ‌కాశం ల‌భించింది. త‌న టాలెంట్ తో పాపుల‌ర్ అయ్యాడు.అయితే.. విలాస‌వంతంగా గ‌డ‌పాల‌న్న ఉద్దేశంతో అడ్డ‌దారులు గొక్కాడు. ఇళ్ల‌ల్లో చోరీలు చేయ‌టం షురూ చేశాడు.

ఉద‌యం బైకుల మీద తిరుగుతూ రెక్కి నిర్వ‌హించేవాడు. తాళాలు వేసిన ఇళ్ల‌ను గుర్తించేవాడు. రాత్రి అయ్యేస‌రికి ఆ ఇళ్ల‌ను టార్గెట్ చేసి దొంగ‌త‌నం చేసేవాడు. గ‌తంలో ఒక సెల్ ఫోన్ దొంగ‌త‌నం కేసులోనూ నిందితుడిగా ఉన్న‌ట్లు గుర్తించారు. వ‌రుస‌గా చోరీల‌పై ఫిర్యాదులు రావ‌టంతో దృష్టి పెట్టిన పోలీసులు.. ఆధారాల‌తో నాగ‌రాజును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి ద‌గ్గ‌ర నుంచి సుమారు రూ.22 ల‌క్ష‌ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాల్ని స్వాధీనం చేసుకున్నారు. టీవీల్లో క‌నిపిస్తూ న‌వ్వించే వ్య‌క్తి ఇళ్ల‌ల్లో చోరీలు చేస్తాడా? అన్నది ఇప్పుడు న‌మ్మ‌శ‌క్యం కానిదిగా మారింది.