Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ రీమేక్ మూవీ పోస్టుపోన్..??

By:  Tupaki Desk   |   24 Jun 2021 9:30 AM GMT
పవర్ స్టార్ రీమేక్ మూవీ పోస్టుపోన్..??
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ ఈ ఏడాది వకీల్ సాబ్ తో గ్రాండ్ రీఎంట్రీ చేసిన పవన్.. ఆ సక్సెస్ తో ప్రస్తుతం తదుపరి సినిమాలు త్వరగా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇదివరకే రీమేక్ మూవీ అయ్యప్పనుమ్ కోషియం, హరిహర వీరమల్లు సినిమాలు కొంత షూటింగ్ కంప్లీట్ చేసాడు. అయితే అయ్యప్పనుమ్ షూటింగ్ ఇదివరకు నలభై శాతం పూర్తి చేశారట. ఈ సందర్బంగా మలయాళం రీమేక్ అయ్యప్పనుమ్ కోషియం సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు.

డైరెక్టర్ సాగర్ చంద్ర తన సెకండ్ మూవీగా ఏకే మూవీ తెరకెక్కిస్తున్నాడు. అయితే షూటింగ్ కంటిన్యూగా జరిగి ఉంటే ఈ ఏడాది ఏకే రిలీజ్ సాధ్యం అయ్యేదేమో.. కానీ వకీల్ సాబ్ రిలీజ్ టైంలోనే కరోనా సెకండ్ వేవ్ రావడం.. షూటింగ్స్ - సినిమాలు అంతా పరిస్థితి తారుమారు కావడంతో మేకర్స్ వాయిదా వేసే ఆలోచనలో పడ్డారు. తాజా సమాచారం మేరకు.. అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ ఇంకా సగానికి పైగా షూటింగ్ మిగిలి ఉంది. కాబట్టి మూవీని ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్రణాళిక మేకర్స్ సిద్ధం చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్.

ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ఇప్పటికి సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. జులైలో షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఈ మూవీలో పవన్ తో పాటు రానా కూడా హీరో రోల్ ప్లే చేస్తున్నాడు. మరి వీరి పోరు ఎలా ఉంటుందో తెలీదు కానీ సినిమా పై అంచనాలు మాత్రం ఓ రెంజీలో నెలకొన్నాయి. ఒకవేళ నిజంగానే అయ్యప్పనుమ్ కోషియం రిలీజ్ సంక్రాంతికి వాయిదా వేస్తే మాత్రం సంక్రాంతికి రిలీజ్ అనుకున్న 'హరిహర వీరమల్లు' సినిమా మరి కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉంది. చూడాలి మరి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఏకే రీమేక్ తెరకెక్కుతుంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - మాటలు అందిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.