Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : ఒల్లు విరుపులతో గుండెల్లో గుబులు

By:  Tupaki Desk   |   6 Jun 2022 4:29 AM GMT
ఫోటోటాక్ : ఒల్లు విరుపులతో గుండెల్లో గుబులు
X
తెలుగు ప్రేక్షకులకు భరత్‌ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాలతో సుపరిచితురాలు అయిన కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రేజీ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు మరియు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోతతో పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో ఈ అమ్మడు చేరిపోయింది.

ప్రస్తుతం రామ్‌ చరణ్ మరియు శంకర్‌ ల కాంబోలో రూపొందుతున్న సినిమాలో కియారా అద్వానీ నటిస్తోంది. మరో వైపు బాలీవుడ్ లో రెండు మూడు పెద్ద సినిమాల్లో కూడా ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే.

హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న కియారా అద్వానీ మోడలింగ్‌ లో మేటి అన్నట్లుగా ఎప్పటికప్పుడు హాట్‌ ఫోటో షూట్స్ ను షేర్‌ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది.

తాజాగా ఈ ఫోటోలను షేర్‌ చేసి అందాలను ఎంత వరకు చూపించాలో అంత వరకు.. ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపించింది. నడుము.. థైస్‌ ను ఎక్స్ పోజ్‌ చేయడంతో పాటు ఒల్లు విరుపులతో యువత గుండెల్లో గుబులు పెట్టే విధంగా చూస్తూ మతి పోగొట్టేస్తుంది. హాట్‌ బ్యూటీ కియారా అద్వానీ ఈ ఫోటోట్లో నెక్ట్స్ లెవల్ అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

హీరోయిన్ గా వచ్చిన క్రేజ్ ను ఇలాంటి ఫోటోలు షేర్‌ చేసి మరింతగా ఆ పేరును పెంచుకుంటుంది. అందాల ఆరబతో విషయంలో నెం.1 అనిపించుకుంటున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ మరో సారి రామ్‌ చరణ్‌ తో ఆర్‌ సీ 15 లో జత కట్టబోతున్న నేపథ్యంలో కొందరు అభిమానులు వినయ విధేయ రామ ఫలితం పునరావృతం అయ్యేనా అంటూ కంగారు పడుతున్నారు.

శంకర్‌ సినిమా కనుక ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో వందల కోట్ల వసూళ్లు ఈ సినిమాకు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మడు ఇలాగే అందాలను ఆరబోస్తూ అందరి ని అన్ని రకాలుగా ఎంటర్‌ టైన్ చేస్తూ వెండి తెర మరియు సోషల్‌ మీడియాలో దూసుకు పోవాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.