Begin typing your search above and press return to search.

పవన్-రానా పోరాటానికి అలాంటి టైటిలా..?

By:  Tupaki Desk   |   29 March 2021 8:18 AM GMT
పవన్-రానా పోరాటానికి అలాంటి టైటిలా..?
X
టాలీవుడ్లో భారీ మ‌ల్టీసార‌ర్ గా తెర‌కెక్కుతున్న చిత్రాల్లో.. ప‌వ‌న్ క‌ల్యాణ్ - రానా ద‌గ్గుబాటి న‌టిస్తున్న ‘అయ్య‌ప్పనుమ్ కోషియం’ రీమేక్ ఒక‌టి. ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ ను భ‌ల్లాల దేవ ఢీకొన‌బోతున్నాడు. వీరిద్ద‌రూ ప్ర‌తినాయ‌కులుగా న‌టిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

అయితే.. సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా చేరిపోవ‌డం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేతోపాటు మాటలు కూడా త్రివిక్ర‌మ్ అందిస్తున్నారు. దీంతో మాట‌ల మాంత్రికుడి మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాల‌ని ఫ్యాన్స్ ఆరాట‌ప‌డుతున్నారు.

కాగా.. త్రివిక్ర‌మ్ ను ఎందుకు తీసుకోవాల్సి వ‌చ్చిందో ఇటీవ‌ల‌ వివ‌రించారు నిర్మాత‌. బిగ్ మూవీని హ్యాండిల్ చేస్తున్న యంగ్ డైరెక్ట‌ర్‌ సాగ‌ర్ చంద్రకు.. ఎవ‌రైనా సీనియ‌ర్ స‌పోర్టు ఉంటే బాగుంటుంద‌ని భావించిన‌ట్టు చెప్పారు. ప‌వ‌న్ - రానా ఒక‌రినొక‌రు ఢీకొన‌బోతున్న ఈ చిత్రంలో డైలాగుల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంద‌ని, త్రివిక్ర‌మ్ అయితే.. బాగుంటుంద‌ని ఆహ్వానించిన‌ట్టు చెప్పారు.

అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే ఈ సినిమా టైటిల్ లో త్రివిక్ర‌మ్ మార్కు ఉంటుంద‌నే ప్ర‌చారం సా‌గుతోంది. ఈ చిత్రంలో ఇద్ద‌రు స్టార్లు త‌ల‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. టైటిల్ మాత్రం సాఫ్ట్ గా ఉంటుంద‌ని తెలుస్తోంది. అదే స‌మ‌యంలో ప‌వ‌ర్ ఫుల్ మీనింగ్ కూడా ఉంటుంద‌ని స‌మాచారం. మ‌రి, అది ఏంటీ..? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్న‌ది చూడాలి. సినిమాను మాత్రం సెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.