Begin typing your search above and press return to search.

'అంటే సుంద‌రానికి' ఈవెంట్ పై పోలీసులు సీరియ‌స్‌

By:  Tupaki Desk   |   11 Jun 2022 6:32 AM GMT
అంటే సుంద‌రానికి ఈవెంట్ పై పోలీసులు సీరియ‌స్‌
X
నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ 'అంటే సుంద‌రానికి'. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ల‌యాళ న‌టి న‌జ్రియా న‌జీమ్ ఈ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు స‌రిచ‌య‌మైంది. క్రేజీ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ స్థాయిలో నిర్మాత‌లు య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, న‌వీన్ యెర్నేని నిర్మించారు. ఈ శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్ గా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

తొలి రోజు తొలి షో నుంచి హిలేరియ‌స్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అనే పేరుని సొంతం చేసుకుని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. నాని, న‌జ్రియాల మ‌ధ్య కుదిరిన కెమిస్ట్రీ.. ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్ని బాగా ఆక‌ట్టుకుంటున్నాయ‌ట‌.

ఇదిలా వుంటే ఈ మూవీ మేక‌ర్స్ పై తాజాగా కేసు న‌మోదైంది. ఎలాంటి అనుమ‌తి తీసుకోకుండా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని న‌ర్వ‌హించారంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ పై ఈవెంట్ ని నిర్వ‌హించిన వ్రేయాస్ మీడియా పై మాదాపూర్ పోలీసులు తాజాగా కేసు న‌మోదు చేశారు.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గురువారం మాదాపూర్ లోని శిల్ప‌క‌ళావేదిక‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా స్టార్ హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌ర‌య్యారు.

అయితే ఈ ఈవెంట్ కి ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి స్టార్ హీరో వ‌స్తున్న‌ప్ప‌టికీ ఈ విష‌యంపై పోలీసుల‌కు ఈవెంట్ నిర్వాహ‌కులు కానీ, స‌ద‌రు ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ కాని స‌మాచారం ఇవ్వ‌లేద‌ని పోలీసులు వీరిపై తాజాగా కేసు న‌మోదు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా ఈవెంట్ ని నిర్వ‌హించ‌డం నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని, శ్రేయాస్ మీడియా ఈవెంట్ మేనేజ‌ర్ సురేష్ తో పాటు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ పై సెక్ష‌న్ 188 కింద మాదాపూర్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. దీంతో ఈ వార్త శ‌నివారం ఫిల్మ్ స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.