Begin typing your search above and press return to search.

నయనతారపై ప్రభుదేవ భార్య కోపం ఇంకా తగ్గలేదా?

By:  Tupaki Desk   |   15 April 2020 5:00 PM IST
నయనతారపై ప్రభుదేవ భార్య కోపం ఇంకా తగ్గలేదా?
X
ప్రభుదేవా.. దక్షిణాది హీరో - దర్శకుడు - కొరియా గ్రాఫర్. ఇప్పుడు హిందీలోనూ దర్శకుడిగా సత్తా చాటుతున్నాడు. మంచి ఫ్యామిలీ మ్యాన్ గా పేరుతెచ్చుకున్న ప్రభుదేవ భార్య, పిల్లల పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడట.. కానీ 2011 నుంచి ఆయన గుణంలో చాలా మార్పులు వచ్చాయని ఆయన భార్య రమాలత్ తాజాగా ఆరోపించినట్టు తమిళనాట మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇంతకీ ప్రభుదేవ మారడానికి కారణం ఎవరో తెలుసా? ఆయన మాజీ ప్రేయసి - స్టార్ హీరోయిన్ నయనతార.. నయనతార ఎప్పుడైతే ప్రభుదేవతో డేటింగ్ మొదలుపెట్టిందో అప్పుడే ఆయన 15 ఏళ్ల కాపురం చేసిన భార్య రమాలత్ కు 2011లో విడాకులిచ్చాడు. పచ్చటి సంసారం నయనతార వల్ల పెటాకులైందని రమాలత్ ఆరోపించారట..

రమాలత్ ఒక ముస్లిం.కానీ ప్రభుదేవ కోసం హిందూమతంలోకి మారి మరీ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రభుదేవ కొడుకు 2008లో క్యాన్సర్ తో చనిపోయాడు. అనంతరం నయనతార ఏకంగా ప్రభుదేవ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటివరకు ఫ్యామిలీకి ఎంతో విలువనిచ్చిన ప్రభుదేవ కుటుంబాన్ని వదిలేసి ఆమె మాయలో పడిపోయాడని రమాలత్ ఆరోపించింది. నయనతార ఒక దుష్టశక్తి అని.. నా కాపురాన్ని నిలువునా చీల్చిందని వాపోతోంది.

తమకు ప్రభుదేవ ఏ లోటు రానీయలేదని.. ఇల్లు - పిల్లల చదువులు బాగా చెప్పించారని.. కానీ నయనతార తమ కాపురాన్ని కూల్చిందని రమాలత్ అన్నట్టు తమిళనాట వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నయనతార కనిపిస్తే నిలువునా చీరేస్తానని రమాలత్ అన్నట్టు ప్రచారం సాగుతోంది.

ఇలా సవితి పోరుతో ప్రభుదేవ భార్య ఎపిసోడ్ మరోసారి వార్తల్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.