Begin typing your search above and press return to search.
'క్రాక్' వివాదంపై స్పందించిన ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు..!
By: Tupaki Desk | 9 Feb 2021 5:44 AM GMTమాస్ మహారాజా రవితేజ నటించిన 'క్రాక్' సినిమా రెమ్యునరేషన్ విషయంలో డైరెక్టర్ గోపీచంద్ మలినేని - ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 'క్రాక్' సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన పన్నెండు లక్షల రూపాయల బ్యాలెన్స్ అమౌంట్ ఠాగూర్ మధు ఇవ్వడం లేదంటూ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో గోపీచంద్ ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తెలుగు నిర్మాతల మండలి వివరణ కోరుతూ డైరెక్టర్స్ అసోసియేషన్ ఓ లేఖ రాశారు. దీని కోసం నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్, నిర్మాత మధుని వివరణ కోరడంతో పాటు ఈ సమస్య పరిష్కారానికి కె.ఎల్.నారాయణ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో 'క్రాక్' నిర్మాత ఠాగూర్ మధు ఓ న్యూస్ ఛానల్ తో ఈ వివాదంపై మాట్లాడారు. ''మిస్ కమ్యూనికేషన్ కారణంగానే ఈ వివాదం వచ్చింది. చాలా శ్రమపడి క్రాక్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. కోవిడ్ సమయంలో బడ్జెట్ పెరిగినా సినిమాను పూర్తి చేశాం. త్వరలోనే ఈ విషయంపై కమిటీతో మాట్లాడుతాను. కమిటీపై నమ్మకం ఉంది. సమస్యను నిర్మాతల మండలి పరిష్కరిస్తుందని భావిస్తున్నాను. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆ వివరాలను చెప్పలేను. త్వరలోనే వివరించే ప్రయత్నం చేస్తాను" అని ఠాగూర్ మధు చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో 'క్రాక్' నిర్మాత ఠాగూర్ మధు ఓ న్యూస్ ఛానల్ తో ఈ వివాదంపై మాట్లాడారు. ''మిస్ కమ్యూనికేషన్ కారణంగానే ఈ వివాదం వచ్చింది. చాలా శ్రమపడి క్రాక్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. కోవిడ్ సమయంలో బడ్జెట్ పెరిగినా సినిమాను పూర్తి చేశాం. త్వరలోనే ఈ విషయంపై కమిటీతో మాట్లాడుతాను. కమిటీపై నమ్మకం ఉంది. సమస్యను నిర్మాతల మండలి పరిష్కరిస్తుందని భావిస్తున్నాను. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆ వివరాలను చెప్పలేను. త్వరలోనే వివరించే ప్రయత్నం చేస్తాను" అని ఠాగూర్ మధు చెప్పుకొచ్చారు.