Begin typing your search above and press return to search.
ప్రాజెక్ట్ K - అమితాబ్ సాబ్ ఆ ఒక్క మాటతో..
By: Tupaki Desk | 7 July 2023 12:43 PM GMTఆదిపురుష్ తర్వాత ప్రభాస్ చేస్తున్న అతి పెద్ద చిత్రం ప్రాజెక్ట్ కె. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైజయంతి బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
కేవలం అమితాబ్ మాత్రమే కాదు, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ లాంటి వారు నటిస్తుండటంతో, ఈ మూవీపై చాలా క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ శుక్రవారం బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ప్రాజెక్ట్ కె సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన 'శాన్ డియాగో కామిక్ కాన్' ఈవెంట్లో పాల్గొననున్నట్లుగా చిత్ర బృదం ప్రకటించింది.
అమెరికాలో జరగనున్న 'శాన్ డియాగో కామిక్ కాన్' ఈవెంట్లో 'ప్రాజెక్ట్ కె' టీమ్ అంతా పాల్గొననుంది. ఈ ఈవెంట్కు హాజరు కానున్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్ట్ కె రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్ని విడుదల చేసింది.
ఈ విషయం తెలిసి అమితాబచ్చన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'శాన్ డియాగో కామిక్ కాన్' ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టీమ్ పాల్గొననుండటం పట్ల అమితాబ్ బచ్చన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయం తనకు ఎంతో గర్వకారకంగా ఉందన్నారు.
ఈ సినిమా ఇంత పెద్దది అని తాను ఊహించలేకపోయానని అన్నారు. ఈ విషయం తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. వైజయంతీ మూవీస్, నాగ్ సర్ , యూనిట్ మొత్తం తనపై చూపిన అభిమానానికి చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత అద్భుతమైన మూవీలో తనను కూడా భాగం చేసినందుకు కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
అమితాబ్ లాంటి గొప్ప లెజండరీ యాక్టర్ యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ని నాగ్ సార్ అంటూ సంబోధించడం గొప్ప విషయం. అమితాబ్ కు ఈ సినిమాపై ఎంత గొప్ప ఫీలింగ్ రాకపోతే ఆ మాట అనగలరు. ఈ మాటతోనే అమితాబ్ సాబ్ సినిమా లెవెల్ ను పెంచేశారు.
ఇదిలా ఉండగా ఈవెంట్ కి దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, దీపిక పదుకునే, కమల్ హాసన్ దీనికి హాజరు కానున్నారు. ఇదే వేదికపై ఈ సినిమా టైటిల్, టీజర్ని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ మూవీతో అయినా ప్రభాస్ హిట్టు కొడతాడో లేదో చూడాలి.
కేవలం అమితాబ్ మాత్రమే కాదు, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ లాంటి వారు నటిస్తుండటంతో, ఈ మూవీపై చాలా క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ శుక్రవారం బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ప్రాజెక్ట్ కె సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన 'శాన్ డియాగో కామిక్ కాన్' ఈవెంట్లో పాల్గొననున్నట్లుగా చిత్ర బృదం ప్రకటించింది.
అమెరికాలో జరగనున్న 'శాన్ డియాగో కామిక్ కాన్' ఈవెంట్లో 'ప్రాజెక్ట్ కె' టీమ్ అంతా పాల్గొననుంది. ఈ ఈవెంట్కు హాజరు కానున్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్ట్ కె రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్ని విడుదల చేసింది.
ఈ విషయం తెలిసి అమితాబచ్చన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'శాన్ డియాగో కామిక్ కాన్' ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టీమ్ పాల్గొననుండటం పట్ల అమితాబ్ బచ్చన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయం తనకు ఎంతో గర్వకారకంగా ఉందన్నారు.
ఈ సినిమా ఇంత పెద్దది అని తాను ఊహించలేకపోయానని అన్నారు. ఈ విషయం తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. వైజయంతీ మూవీస్, నాగ్ సర్ , యూనిట్ మొత్తం తనపై చూపిన అభిమానానికి చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత అద్భుతమైన మూవీలో తనను కూడా భాగం చేసినందుకు కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
అమితాబ్ లాంటి గొప్ప లెజండరీ యాక్టర్ యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ని నాగ్ సార్ అంటూ సంబోధించడం గొప్ప విషయం. అమితాబ్ కు ఈ సినిమాపై ఎంత గొప్ప ఫీలింగ్ రాకపోతే ఆ మాట అనగలరు. ఈ మాటతోనే అమితాబ్ సాబ్ సినిమా లెవెల్ ను పెంచేశారు.
ఇదిలా ఉండగా ఈవెంట్ కి దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, దీపిక పదుకునే, కమల్ హాసన్ దీనికి హాజరు కానున్నారు. ఇదే వేదికపై ఈ సినిమా టైటిల్, టీజర్ని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ మూవీతో అయినా ప్రభాస్ హిట్టు కొడతాడో లేదో చూడాలి.