Begin typing your search above and press return to search.
PS 2 బాక్సాఫీస్.. 300 కోట్లు వచ్చినా లాభం లేదు
By: Tupaki Desk | 10 May 2023 5:11 PM GMTదక్షిణాదిలోని మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తమిళ చిత్ర పరిశ్రమలో చాలా కాలంగా భారీ విజయాలు మాత్రం రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో మంది స్టార్ల ను కలిపి చేసిన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్'. గత ఏడాది వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో దీనికి సీక్వెల్గా 'పొన్నియన్ సెల్వన్ 2'ను తీసుకొచ్చారు.
ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ భారీగా దక్కాయి. ఆ తర్వాత కూడా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రాబట్టింది. అయితే, తెలుగులో మాత్రం పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. ముఖ్యంగా రెండో వారంలో మాత్రం ఈ భారీ చిత్రానికి మొత్తంగా నిరాశే ఎదురవుతోంది.
ఈ మంగళవారంతో థియేటర్లలో 12 రోజుల రన్ను పూర్తి చేసుకున్న భారీ బడ్జెట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్ 2' ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 14.05 కోట్లు గ్రాస్ రాబట్టింది. అలాగే, తమిళనాడులో రూ. 114.25 కోట్లు, కర్నాటకలో రూ. 19.50 కోట్లు, కేరళలో రూ. 15.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 22.45 కోట్లు, ఓవర్సీస్లో రూ. 116.65 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
తమిళ బాహుబలి గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీ 12 రోజులు పూర్తయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 302.25 కోట్లు గ్రాస్, రూ. 145.30 కోట్లు షేర్ ను వసూలు చేసింది. అయినప్పటికీ ఇది క్లీన్ హిట్ స్టేటస్ ను చేరుకోవాలంటే మాత్రం ఇంకా రూ. 26.70 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే అది కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు.
అన్ని ఏరియాల్లో కంటే తెలుగులోనే 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి తక్కువ వసూళ్లు వస్తున్నాయి. ఆంధ్రా, తెలంగాణలో రూ. 10 కోట్లు బిజినెస్ చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పటి వరకూ రూ. 6.62 కోట్లే రాబట్టగా.. ఇంకా హిట్ కు రూ. 3.88 కోట్ల దూరంలో ఉంది. ఇదిలా ఉండగా.. 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి టాలెంటెడ్ స్టార్లు నటించారు.
ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ భారీగా దక్కాయి. ఆ తర్వాత కూడా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రాబట్టింది. అయితే, తెలుగులో మాత్రం పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. ముఖ్యంగా రెండో వారంలో మాత్రం ఈ భారీ చిత్రానికి మొత్తంగా నిరాశే ఎదురవుతోంది.
ఈ మంగళవారంతో థియేటర్లలో 12 రోజుల రన్ను పూర్తి చేసుకున్న భారీ బడ్జెట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్ 2' ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 14.05 కోట్లు గ్రాస్ రాబట్టింది. అలాగే, తమిళనాడులో రూ. 114.25 కోట్లు, కర్నాటకలో రూ. 19.50 కోట్లు, కేరళలో రూ. 15.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 22.45 కోట్లు, ఓవర్సీస్లో రూ. 116.65 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
తమిళ బాహుబలి గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీ 12 రోజులు పూర్తయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 302.25 కోట్లు గ్రాస్, రూ. 145.30 కోట్లు షేర్ ను వసూలు చేసింది. అయినప్పటికీ ఇది క్లీన్ హిట్ స్టేటస్ ను చేరుకోవాలంటే మాత్రం ఇంకా రూ. 26.70 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే అది కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు.
అన్ని ఏరియాల్లో కంటే తెలుగులోనే 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి తక్కువ వసూళ్లు వస్తున్నాయి. ఆంధ్రా, తెలంగాణలో రూ. 10 కోట్లు బిజినెస్ చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పటి వరకూ రూ. 6.62 కోట్లే రాబట్టగా.. ఇంకా హిట్ కు రూ. 3.88 కోట్ల దూరంలో ఉంది. ఇదిలా ఉండగా.. 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి టాలెంటెడ్ స్టార్లు నటించారు.