Begin typing your search above and press return to search.

పూరీ.. ముగ్గురిలో ఎవరితో..?

By:  Tupaki Desk   |   24 Sep 2022 4:57 AM GMT
పూరీ.. ముగ్గురిలో ఎవరితో..?
X
గతంలో టాలీవుడ్ స్టార్ హీరోలకు సూపర్ హిట్లు - బ్లాక్ బస్టర్లు అందించిన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు తమతో సినిమా చేయమని వెంటబడ్డ హీరోలు సైతం.. ఇప్పుడు 'లైగర్' ప్లాప్ తర్వాత మొహం చాటేస్తున్నారనే కామెంట్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

'టెంపర్' తర్వాత అర డజను ప్లాప్స్ అందుకున్న పూరీ.. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. దీంతో పూరీ ఈజ్ బ్యాక్ అని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో 'లైగర్' సినిమా అనౌన్స్ చేయడంతో పాన్ ఇండియా షేక్ అవుతుందని భావించారు.

అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన 'లైగర్' సినిమా బాక్సాఫీస్ వద్ద డబుల్ డిజాస్టర్ గా మిగిలింది. పూరీ జగన్నాథ్ తన కెరీర్ లో ఎన్నో హిట్లు చూసాడు.. ప్లాప్స్ అందుకున్నాడు. కానీ ఈ సినిమాకు ఎప్పుడూ లేనంతగా విమర్శలు ఎదుర్కొన్నాడు. తన మార్క్ ఏమాత్రం లేని ఓ పేలవమైన సినిమాతో వచ్చాడనే కామెంట్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది.

'లైగర్' మూవీ ఘోర పరాజయం చెందడంతో ఇప్పుడు స్టార్ హీరోలే కాదు.. మీడియం రేంజ్ హీరోలు కూడా పూరీ జగన్నాథ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పూరీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుంది.. ఎప్పుడు ఉంటుంది అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

నిజానికి 'లైగర్' రిలీజ్ అవ్వకముందే పూరీ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో 'జనగణమన' అనే పాన్ ఇండియా చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. అయితే ఆ ప్రాజెక్ట్ మీద ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ భాగస్వాములు వెనక్కి తగ్గడంతో అసలు ఈ చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు రూమర్స్ వచ్చాయి. దీంతో పూరీ తదుపరి సినిమా వీరితోనే అంటూ ముగ్గురి పేర్లు తెర మీదకు వచ్చాయి.

పూరీ జగన్నాథ్ తన కొడుకు ఆకాశ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల ప్రచారం జరిగింది. 'మెహబూబా' సినిమాతో తనయుడికి హిట్టు ఇవ్వలేకపోయిన దర్శకుడు.. ఇప్పుడు అతన్ని హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టానున్నాడని వార్తలు చక్కర్లు కొట్టాయి.

అలానే నటసింహం నందమూరి బాలకృష్ణ తో డేరింగ్ డైరెక్టర్ వర్క్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఊహాగానాలు వచ్చాయి. బాలయ్యలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన 'పైసా వసూల్' తర్వాత.. దర్శక హీరోలు మళ్లీ కలిసి పని చేయాలని అనుకున్నారు. అది ఇన్నాళ్లకు కుదురుతుందని.. ప్రస్తుతం సీనియర్ హీరో కమిట్ మెంట్స్ పూర్తైన వెంటనే పూరీ సినిమా ఉంటుందని చెప్పుకున్నారు.

ఇదిలా ఉంటే పూరీ ఉస్తాద్ రామ్ పోతినేని తో 'ఇస్మార్ట్ శంకర్ 2' చేసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చేస్తామని ఇద్దరూ ప్రకటించారు. కానీ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడం వల్ల కుదరలేదు. ఇప్పుడు పూరీ 'JGM' మూవీ క్యాన్సిల్ అవ్వడంతో రామ్ కోసం కథను సిద్ధం చేయనున్నాడని అంటున్నారు.

ఇలా ముగ్గురు హీరోలతో పూరీ వర్క్ చేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాకపోతే వీరిలో బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని మరియు అనిల్ రావిపూడి సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు బోయపాటి శ్రీను తో కలిసి పాన్ ఇండియా మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు రామ్. ఇవి పూర్తి చేసుకొని పూరీ దగ్గరకు రావడానికి టైం పడుతుంది. మరి ఈ గ్యాప్ లో తన కొడుకు ఆకాష్ తో ఓ మూవీ చేస్తాడేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.