Begin typing your search above and press return to search.

'పుష్ప‌-2' ప‌వ‌ర్ పుల్ డైలాగ్ లీక్..ఆ డైలాగ్ ఇదే!

By:  Tupaki Desk   |   11 Dec 2022 6:12 AM GMT
పుష్ప‌-2 ప‌వ‌ర్ పుల్ డైలాగ్ లీక్..ఆ డైలాగ్ ఇదే!
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థ‌నాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల మ‌ద్య 'పుష్ప -ది రూల్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. తొలిభాగం భారీ విజ‌యం సాధించ‌డంతో మ‌లిభాగాన్ని ఏకంగా అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తోనే తెర‌కెక్కిస్తు న్నారు. రిలీజ్ సైతం అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఒకేసారి అన్ని భాష‌ల్లోనూ రిలీజ్ చేసి ట్రెండ్ సెట్ చేయాల‌ని భారీ ప్ర‌ణాళిక తోనే క‌దులుతున్నారు.

ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని డైలాగ్ లు లీక‌య్యాయి. "అడ‌విలో జంతువులు నాలుగు అడుగులు వెన‌క్కి వేసాయి అంటే''? ''పులి వ‌చ్చింద‌ని అర్ధం" అదే పులి నాలుగు అడుగులు వెన్కి వేసందంటే పుష్ప రాజ్ వ‌చ్చాడ‌ని అర్ధం' అనే లెంగ్తీ డైలాగ్ ఒక‌టి లీక్ అయిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

ప్ర‌స్తుతం ఈ డైలాగ్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ మాస్ డైలాగుల‌కు కొద‌వ‌లేదు. 'వాళ్లు గొర్నెల్ని కాయ‌డానికి వ‌చ్చారు. ఆ గొరెల్ని తిన‌డానికి పులి వ‌స్తే వేసేయ‌డానికి నేను వ‌చ్చాను' అంటూ పుష్ప‌రాజ్ డైలాగ్ చెబుతాడు. ఇలాంటి లెంగ్తీ డైలాగులు సినిమాలో చాలానే ఉన్నాయి. తాజాగా లీకైన అడ‌వి రిలేటెడ్ డైలాగ్ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటుంది. మ‌రి ఇది ఎలా లీకైంద‌న్న‌ది తెలియాలి. ఇంత వ‌ర‌కూ ఈ డైలాగ్ పై టీమ్ ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.

'అవతార్ -2' డిసెంబ‌ర్ 16న రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో అదో రోజున ఆ సినిమాతో పాటు 'పుష్ప‌-2' గ్లింప్స్ ని రిలీజ్ చేయ‌డానికి రెడీ అవుతోన్న‌స‌గ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో లీకైన డైలాగ్ గ్లింప్స్లో వినిపించే అవ‌కాశం ఉందేమో చూడాలి. ఇందులో బ‌న్నీ కి జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. ఇంకా కీల‌క పాత్ర‌ల్లో అగ్ర తార‌లే క‌నిపించ‌నున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో చిత్రాన్ని నిర్మిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.