Begin typing your search above and press return to search.

ప్రతిభావంతులు అందరూ ఒకే క్లిక్ లో

By:  Tupaki Desk   |   4 May 2016 6:54 AM GMT
ప్రతిభావంతులు అందరూ ఒకే క్లిక్ లో
X
తాజాగా ఢిల్లీలో సినీ రంగానికి సంబంధించిన ఓ మహా కార్యక్రమం జరిగింది. 65వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవానికి అన్ని భాషల సినీ పరిశ్రమల నుంచి దిగ్గజాలు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మన తెలుగు సినిమాకి కూడా కొన్ని ప్రతిష్టాత్మక అవార్డులు దక్కగా.. ఈ మొత్తంలో ఒక ఫోటో మాత్రం సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

ఈ జాతీయ పురస్కారాల్లో బాహుబలి చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. మరోవైపు బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు కూడా బాహుబలికే దక్కింది. ఈ అవార్డులను అందుకునేందుకు గాను... టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, బాహుబలి చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు విచ్చేశారు. వీరంతా ఒక చోటకు చేరిన సమయంలో.. అక్కడికి ఉత్తమ తెలుగు చిత్రం అవార్డును అందుకున్న క్రిష్ కూడా రావడంతో.. ఆ కలయిక అద్భుతంగా అనిపించింది.

రాజమౌళి, క్రిష్ లు తాము అందుకున్న అవార్డులను చూపుతూ.. ఫోటోలకు పోజులిచ్చారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ప్రతిభావంతులు, సాహసాలకు వెరవని ధైర్యవంతులుగా గుర్తింపు పొందిన వీరంతా ఒకచోట కనిపించడం.. ఎంతో అరుదైన దృశ్యంగా చెప్పాలి. రీసెంట్ టైంలో బెస్ట్ ఫోటో ఆఫ్ టాలీవుడ్ అని జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారంటే.. ఈ పిక్చర్ ఎంత స్పెషల్ అనే విషయం అర్ధమవుతుంది.