Begin typing your search above and press return to search.

మహేష్ కోసం జక్కన్న ఇంకా స్టోరీ లైన్ ని ఫైనలైజ్ చేయలేదా..?

By:  Tupaki Desk   |   3 Jun 2022 10:32 AM GMT
మహేష్ కోసం జక్కన్న ఇంకా స్టోరీ లైన్ ని ఫైనలైజ్ చేయలేదా..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న SSMB28 సినిమా తర్వాత ఈ క్రేజీ కాంబో సెట్స్ మీదకు వెళ్లనుంది.

SSMB29 మూవీ కోసం అందరూ ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. జక్కన్న - మహేష్ కలిసి ఎలాంటి సినిమా చేయబోతున్నారు? అది ఏ జోనర్ లో ఉంటుంది? అసలు ఈ సినిమా కథేంటి? అని చర్చిస్తూనే ఉన్నారు.

రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ కోసం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ స్టోరీని అనుకున్నట్లు హింట్ ఇచ్చారు. జక్కన్న సైతం ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మహేశ్ కోసం రెండు ఆసక్తికరమైన స్టోరీ లైన్స్ రెడీగా ఉన్నట్లు జక్కన్న తెలిపారు.

RRR సినిమా విడుదలై రెండు నెలలు దాటి పోవడంతో.. రాజమౌళి ఈ గ్యాప్ లో స్టోరీ లైన్ గురించి మహేష్ బాబుతో చర్చించి ఉంటారని అందరూ భావించారు. ముందుగా చెప్పినట్లు ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని అనుకున్నారు. అయితే అసలు ఇంతవరకు దర్శకహీరోలు స్టోరీ గురించి చర్చించలేదని తెలుస్తోంది.

ఇటీవల 'మేజర్' ప్రమోషన్స్ లో మహేష్ బాబు ఇంకా రాజమౌళికి సినిమా కథ గురించి ఖచ్చితంగా తెలియదని.. వారు కొన్ని ఐడియాల మీద వర్క్ చేస్తున్నారని.. వాటిలో ఏదీ కన్ఫర్మ్ కాలేదని తెలిపారు. ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైట్మెంట్ గా ఉన్నట్లు పేర్కొన్నారు.

మహేష్ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ డ్రామాగా ఉంటుందని వార్తలు వచ్చినప్పుడు అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే ఇప్పుడు మహేష్ దానిని ఖండించడంతో.. సూపర్ స్టార్ కోసం ఎలాంటి కథ రెడీ చేస్తున్నారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు.

రాజమౌళి ఒక స్టోరీ లైన్ రెడీ చేయడానికి.. ప్రీ విజువలైజేషన్ మరియు ప్రీ-ప్రొడక్షన్ కోసం ఆరు నుండి ఏడు నెలల సమయం తీసుకుంటారు. ఇదంతా జరిగేలోపు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం యూరప్ లో హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్.. తిరిగి వచ్చిన తర్వాత SSMB28 సెట్స్ లో అడుగుపెట్టనున్నారు.

ఇదే క్రమంలో రానున్న SSMB29 చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎల్‌.నారాయ‌ణ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్న రాజమౌళి.. వరుస బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ ఫార్మ్ లో ఉన్న మహేష్ కలిసి ఎలాంటి సినిమాని ఆవిష్కరిస్తారో చూడాలి.