Begin typing your search above and press return to search.

జక్కన్నా.. స్క్రిప్ట్ ఇంకా చెక్కలేదా?

By:  Tupaki Desk   |   15 Jun 2018 3:47 AM GMT
జక్కన్నా.. స్క్రిప్ట్ ఇంకా చెక్కలేదా?
X
బాహుబలి ఘన విజయం తరవాత దర్శక ధీరుడు రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్టు ఏమిటన్న దానిపై దేశంలోని అన్ని భాషల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇలాంటి టైంలో రామ్ చరణ్ తేజ్ - ఎన్టీఆర్ లతో భారీ మల్టీ స్టారర్ తీయడానికి రెడీ అవుతున్నట్లుగా జక్కన్న నుంచి సిగ్నల్స్ వచ్చాయి. దీనిపై ఆయన నోరు విప్పి ఏమీ చెప్పకపోయినా రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ మల్టీ స్టారర్ గానే అందరూ ఫిక్సయ్యారు. ఈ వార్తలను ఆయనా ఎప్పుడూ ఖండించలేదు.

ప్రస్తుతం ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లోనూ.. రామ్ చరణ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లోనూ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండింటి షూటింగ్ పూర్తవగానే మల్టీస్టారర్ మూవీ షూటింగ్ లో జాయినవుతారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి ఇంకా స్క్రిప్ట్ పని మొదలుపెట్టనే లేదట. రాజమౌళి తండ్రి.. రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీకి సంబంధించి మూడు స్టోరీ లైన్లు మాత్రం చెప్పారని తెలుస్తోంది.

రాజమౌళికి ఈ మూడు స్టోరీ లైన్లు నచ్చాయని.. వాటిలో దేనితో సినిమా తీయాలి అన్నదానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ మూడు స్టోరీల్లో ఏవీ మగధీర.. బాహుబలిలా రాజులు.. రాజ్యాల లింకున్నవి లేవని టాక్. ఎప్పుడూ ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేసేదానికి భిన్నంగా సబ్జెక్ట్ ఎంచుకుని థ్రిల్ చేసే జక్కన్న ఈసారీ అలాగే వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. మరి మూడింటిలో దేనిని సెలక్ట్ చేస్తాడో.. స్క్రిప్ట్ పని ఎప్పుడు మొదలుపెడతాడో?