Begin typing your search above and press return to search.

SSMB29 కు జ‌క్క‌న్నటెర్రిఫిక్ ప్లాన్ రెడీ

By:  Tupaki Desk   |   3 May 2022 3:30 AM GMT
SSMB29 కు జ‌క్క‌న్నటెర్రిఫిక్ ప్లాన్ రెడీ
X
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ 'ట్రిపుల్ ఆర్' ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలి సారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఇది. ఇద్ద‌రు లెజెండ‌రీ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం ల పాత్ర‌ల‌ని క‌లుపుతూ ఓ ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ గ్రామాని తెర‌కెక్కించారు. దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ చిత్రం ఐదు భాష‌ల్లో సంచ‌ల‌నాలు సృష్టించింది.

వ‌సూళ్ల ప‌రంగానూ రికార్డుల మోత మోగించింది. వెయ్యి కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన టాప్ టెన్ చిత్రాల్లో నిలిచింది. ఈ మూవీ రిలీజై నెల రోజులు దాట‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ జోరు కాస్త త‌గ్గింది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత రాజ‌మౌళి సూప‌ర్ స్టార్ మహేష్ తో సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం మ‌హేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో జ‌క్క‌న్న తెర‌కెక్కించిన 'ట్రిపుల్ ఆర్‌' సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డంతో త‌మ హీరోని ఏ రేంజ్ లో ప్ర‌జెంట్ చేస్తాడా? అనే ఆస‌క్తి అంద‌రిలోనూ మొద‌లైంది. దీంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రాకుండానే హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ ఒక‌టి తాజాగా బ‌య‌టికి వ‌చ్చి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. రాజ‌మౌళి ..మ‌హేష్ తో చేయ‌బోతున్న చిత్రం SSMB29. ఈ సినిమా కోసం రాజ‌మౌళి టెర్రిఫిక్ ప్లాన్ ని రెడీ చేశార‌ని తెలిసింది.

అత్యంత భారీ స్థాయిలో యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్ట్ ని ఈ ఏడాది చివ‌ర్లో ప్రారంభించ‌డానికి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి సిద్ధం అవుతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆఫ్రికా అడువుల నేప‌థ్యంలో సాగే అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ మూవీని తెర‌కెక‌కించోతున్నారు. ఈ చిత్ర క‌థ కోసం ఇటీవ‌ల లాక్ డౌన్ స‌మ‌యంలోనే రెండు క‌థ‌ల‌ని ఫైన‌ల్ చేసిన రాజ‌మౌళి తాజాగా అందులో ఓ స‌బ్జెక్ట్ ని ఫైన‌ల్ చేసుకున్నార‌ట‌.

ప్ర‌స్తుతం ట్రిపుల్ ఆర్ స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తూ విశ్రాంతి తీసుకుంటున్న జ‌క్క‌న్న త్వ‌ర‌లోనే స్క్రిప్ట్ వ‌ర్క్ ని పూర్తి చేసి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ని స్టార్ట్ చేస్తార‌ట‌. ఈ వ‌ర్క్ పూర్త‌యిపోగానే అంటే ఇయ‌ర్ ఎండింగ్ లో ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు 'స‌ర్కారు వారి పాట‌'ని పూర్తి చేశారు. మే 12న ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల కాబోతోంది. దీని త‌రువాత వెంట‌నే త్రివిక్ర‌మ్ తో చేస్తున్న సినిమాని ప్రారంభిస్తారు. ఇది పూర్త‌యిన త‌రువాత కొంత విశ్రాంతి తీసుకున్నాకే రాజమౌళి సినిమాని మ‌హేష్ మొద‌లుపెడ‌తార‌ట‌.