Begin typing your search above and press return to search.

ఒకసారి చాలదా... ఫ్యాన్‌ పై రకుల్‌ సీరియస్‌

By:  Tupaki Desk   |   14 Feb 2019 3:17 PM IST
ఒకసారి చాలదా... ఫ్యాన్‌ పై రకుల్‌ సీరియస్‌
X
సెలబ్రెటీలు అభిమానుల వల్ల ఇబ్బంది పడ్డ సందర్బాలు చాలానే చూశాం. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌ లు వచ్చిన తర్వాత సెల్ఫీలు అంటూ అనుమతి తీసుకోకుండానే ఫొటోలు తీసుకుంటున్నారు. దూరంగా ఉండి సెల్పీలు తీసుకుంటే పర్వాలేదు, కాని కొందరు మాత్రం సెల్ఫీల పేరుతో మీద పడిపోతూ ఉన్నారంటూ సెలబ్రెటీల ఫిర్యాదు. అడగకుండా సెల్ఫీలు తీసుకునే వారిపై అరవడం కూడా ఈమద్య ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు అదే అనుభవం ఎదురైంది. అయితే వివాదం సీరియస్‌ అవ్వకుండానే అక్కడ నుండి వెళ్లి పోయింది.

రకుల్‌ ఇటీవల ఎయిర్‌ పోర్ట్‌ కు వెళ్లింది. ఎయిర్‌ పోర్ట్‌ లోకి ఎంటర్‌ అవుతున్న సమయంలో కొందరు అభిమానులు ఆమె వద్దకు వచ్చారు. సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె అందుకు ఒప్పుకుని వారితో సెల్ఫీలు తీసుకుంది. ఒక వ్యక్తి మాత్రం మరోసారి సెల్ఫీ అంటూ వచ్చాడట. ఇప్పటికే ఒకసారి వచ్చావు కదా, మళ్లీ ఎందుకు, ఒకసారి చాలదా అంటూ ప్రశ్నించిందట. అతగాడు చిన్నబుచ్చుకుని అక్కడ నుండి వెళ్లి పోయాడు. ఆ తర్వాత రకుల్‌ కూడా అక్కడ నుండి వెళ్లి పోయింది. రకుల్‌ ఆ సమయంలో సీరియస్‌ అయ్యి ఫోన్‌ విసిరేయడం లేదా ఆ వ్యక్తిపై ఇంకా దురుసు వ్యాఖ్యలు చేసి ఉంటే సోషల్‌ మీడియాలో మరోసారి రకుల్‌ టార్గెట్‌ అయ్యి ఉండేది.