Begin typing your search above and press return to search.

ర‌కుల్ పింక్ దెబ్బ‌కి పరేషాన్ కాక మ‌రేంటి!

By:  Tupaki Desk   |   1 March 2022 11:37 AM GMT
ర‌కుల్ పింక్ దెబ్బ‌కి పరేషాన్ కాక మ‌రేంటి!
X
ఢిల్లీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ టెంప్టింగ్ ఎలివేష‌న్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న‌దైన గ్లామ్ షో తో ఇన్ స్టాని హీటెక్కించ‌డం బ్యూటీలో మ‌రో ప్ర‌త్యేక‌త‌. డిజైన‌ర్ వేర్స్ తో పాటు..అవ‌స‌రం మేర హ‌ద్దులు మీరిన దుస్తుల్లో కాక‌లు రేపుతుంది.

తాజాగా మ‌రోస‌రి పింక్ టూపీస్ లో భ‌గ‌భ‌గ‌ మండిపోతున్న సూర్యుడిలో సైతం కాక‌లు రేపే ప్ర‌య‌త్నం చేసింది. న‌డుము లోతు స‌ముద్రంలో జ‌ల‌కాల‌ట‌కు వెళ్లిన బ్యూటీ ఇలా స్విమ్మింగ్ ని ఆస్వాదిస్తోంది. రెండు చేతులు గాల్లోకి న‌డుం లోతు నీటిలో స‌ముద్రానికే అందాల్ని అంకింతం చేసింది. ముఖంలో క్యూట్ స్మైల్ ర‌కుల్ ని మ‌రింత అందంగా ఎలివేట్ చేస్తోంది.

ఇలాంటి బికినీ షోలు బ్యూటీకి కొత్తేం కాదు. టూపీస్..స్విమ్ షూట్ లో చాలాసార్లు ర‌చ్చ‌కు తెర తీసింది. అయితే ఈసారి పింక్ టూపీస్ లో మ‌రింత క‌ల‌ర్ ఫు్ గా హైలైట్ అవుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానులు హాట్ కామెంట్ల‌తో ఎటాకింగ్ దిగారు. ఇక ర‌కుల్ ఇటీవ‌లే ఆగ్రా టూర్ ముగించుకుని వ‌చ్చింది. ప్రియుడు జాకీ భ‌గ్నానీతో క‌లిసి ఓ వివాహ వేడుక‌కు జంట‌గా హాజ‌రైంది.

త్వ‌ర‌లోనే ఈ జంట వివాహ బంధంతో ఒక‌టి కాబోతున్నారు? అన్న వార్త మీడియాని హీటెక్కించింది. దానికి త‌గ్గ‌ట్టు ఆగ్రాలో ఒకరి చిటికిన‌ వేలు మ‌రొక‌రు ప‌ట్టుకుని ఏడు అడుగులు కూడా వేసేసారు. ఈ ఫోటోలు నెట్టింట జోరుగా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఇక ర‌కుల్ సినిమాల విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ లో న‌టిగా బిజీగా ఉంది. `డాక్ట‌ర్ జీ` అనే సినిమాలో న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. అలాగే `ఛ‌త్ర‌వాలీ` అనే మ‌రో సినిమాలో కూడా న‌టిస్తోంది. ఇది షూటింగ్ ద‌శ‌లో ఉంది. `ఎటాక్`..`ర‌న్ వే`..`థాంక్ గాడ్`..`మిష‌న్ సిండ్రాల్లా న‌టిస్తోంది`. వీటిలో కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాయి.

ఇక కోలీవుడ్ లో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `ఇండియ‌న్ -2`లో న‌టిస్తోంది. ఈ సినిమాపై ర‌కుల్ చాలా ఆశ‌లు పెట్టుకుంది. తెలుగులో `31 అక్టోబ‌ర్ లేడీస నైట్` లో న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు..త‌మిళ్ లో తెర‌కెక్కిస్తున్నారు. టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాల్లో అవ‌కాశాలు ఇవ్వాల‌ని ఆమ‌ధ్య‌ బ‌హిరంగానే కోరింది.