Begin typing your search above and press return to search.

ఆ విషయంలో తారక్ కంటే చరణ్ కాస్త ముందున్నాడు..!

By:  Tupaki Desk   |   5 Sep 2021 2:30 AM GMT
ఆ విషయంలో తారక్ కంటే చరణ్ కాస్త ముందున్నాడు..!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలు గత మూడేళ్లుగా ఈ సినిమా కోసమే అంకితమై ఉన్నారు. అయితే చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందని మేకర్స్ ప్రకటించారు. దీంతో RRR హీరోలిద్దరూ తదుపరి ప్రాజెక్ట్స్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ విషయంలో తారక్ కంటే చరణ్ కాస్త ముందున్నాడు.

రామ్ చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో పాటుగా తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో కలిసి 'ఆచార్య' మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రెండు సాంగ్స్ మినహా పూర్తయింది. దీంతో ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో '#RC15' చిత్రాన్ని స్టార్ట్ చేయబోతున్నారు చెర్రీ. సెప్టెంబర్ 8న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని సమాచారం. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు.

ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియరా అడ్వాణీ హీరోయిన్ గా నటించనుంది. ఎస్. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 2022 చివరి నాటికి ఈ సినిమా పూర్తయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరి లేదా సుజీత్ లలో ఎవరో ఒకరితో చరణ్ సినిమా చేస్తాడని టాక్ నడుస్తోంది.

మరోవైపు ఎన్టీఆర్ కూడా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ ఇచ్చేశారు. చివరగా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాతో అభిమానులను పలకరించిన తారక్.. ప్రస్తుతం 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షో హోస్ట్ చేస్తున్నాడు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే చిత్రాన్ని అక్టోబర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు. 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ తర్వాత వీరి కాంబోలో స్టూడెంట్స్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ సినిమా రాబోతోందని ప్రచారం జరుగుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

#NTR30 సినిమా పూర్తైన తర్వాత ఇదే క్రమంలో 'కె.జి.యఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో తారక్ ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ఏదేమైనా 'RRR' సినిమాతో నేషనల్ వైడ్ గా వచ్చే క్రేజ్ ని కాపాడుకునేలా ఎన్టీఆర్ - రామ్ చరణ్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్నారని అర్థం అవుతోంది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ మాదిరిగా.. RRR హీరోల ద్వయం కూడా పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోతారేమో చూడాలి.