Begin typing your search above and press return to search.

వచ్చే ఏడాది 'రంగస్థలం' కాంబోలో మరో సినిమా.. ప్రొడ్యూసర్ క్లారిటీ..!

By:  Tupaki Desk   |   27 March 2021 10:50 AM IST
వచ్చే ఏడాది రంగస్థలం కాంబోలో మరో సినిమా.. ప్రొడ్యూసర్ క్లారిటీ..!
X
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ''రంగస్థలం''. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఎమోషనల్‌ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో చిట్టిబాబుగా చరణ్ అద్భుతమైన నటన టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అయితే ఇప్పుడు 'రంగస్థలం' కాంబోలో మరో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నేడు రామ్ చరణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని శుక్రవారం శిల్పకళావేదికలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని మాట్లాడుతూ మా బ్యానర్ లో వచ్చే ఏడాది చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తామని ఎక్సపెక్ట్ చేస్తున్నాను అని అన్నారు. దీంతో 'రంగస్థలం' కాంబోలో మరో సినిమాకి ప్రయత్నాలు జరుగుతున్నాయని అర్థం అయింది.

చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమా.. కొరటాల శివ డైరెక్షన్ లో తన తండ్రితో కలిసి 'ఆచార్య' సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత దిల్ రాజు బ్యానర్ లో శంకర్ దర్శకత్వంలో 'RC15' సినిమా చేయనున్నాడు. ఇక సుకుమార్ ప్రస్తుతం 'పుష్ప' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత విజయ్ దేవరకొండతో ఓ మూవీ ప్లాన్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక చరణ్ సినిమా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.