Begin typing your search above and press return to search.

చెర్రీ పండోరాకి వెళుతున్నాడా?

By:  Tupaki Desk   |   30 Aug 2018 4:30 PM GMT
చెర్రీ పండోరాకి వెళుతున్నాడా?
X
చెర్రీ & టీమ్‌ ఎవ‌రూ వెళ్ల‌ని పండోరా గ్ర‌హానికి వెళుతున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇంత‌కీ ఎక్క‌డ ఉంది ఆ గ్ర‌హం? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. మా సినిమాని ఎవ‌రూ తెర‌కెక్కించ‌ని ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో తెర‌కెక్కిస్తున్నాం అని చ‌ర‌ణ్ టీమ్ చెబుతోందంటే అదెంతో స్పెష‌ల్ అనే అంచ‌నా వేస్తున్నారు. అస‌లింత‌కీ ఏ లొకేష‌న్ అది?

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో డివివి దాన‌య్య ఓ భారీ చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఇటీవ‌ల హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేశారు. త‌దుప‌రి యూర‌ప్‌లో భారీ షెడ్యూల్‌కి చ‌ర‌ణ్‌- బోయ‌పాటి అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే యూర‌ప్‌లోని ఎగ్జోటిక్ లొకేష‌న్ల వేట‌ను సాగించారు. ఈ వేట‌లో అజెర్‌బైజాన్ అనే అరుదైన దేశంలో అద్భుత‌మైన లొకేష‌న్లు కుదిరాయిట‌. ఆ లొకేష‌న్ల‌కు మంత్ర‌ముగ్ధులైన బోయ‌పాటి అండ్ టీమ్ 30 రోజుల పాటు సుదీర్ఘంగా అక్క‌డే షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇంత‌వ‌ర‌కూ వేరొక తెలుగు సినిమా ఏదీ ఇక్క‌డ చిత్రీక‌రించ‌లేద‌ని, అక్క‌డ‌ అంద‌మైన లొకేష‌న్లు కన్నుల‌పండువ చేయ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

మ‌రీ ఇంత‌గా చెబుతున్నారు.. అంటే ఆ దేశం అంతే స్పెష‌ల్ అని భావించ‌వ‌చ్చు. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని 2019 జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయనున్నారు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న కైరా అద్వాణీ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇదో పూర్తి స్థాయి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్. బోయ‌పాటి యూనిక్ స్టైల్లో తెర‌కెక్కిస్తున్నార‌ట‌.