Begin typing your search above and press return to search.
తండ్రీకొడుకులు కామెడీ సీన్ దింపేసారు
By: Tupaki Desk | 1 May 2022 8:22 AM GMTతండ్రీ-తనయులు మెగా స్టార్ చిరంజీవి..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన `ఆచార్య` నిన్నటి రోజున రిలీజ్ అయి ఎలాంటి టాక్ తో దూసుకుపోతుందో తెలిసిందే. తొలి షోతోనే సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. రివ్యూలు ఏమాత్రం ఆశాజనకంగా రాలేదు. ఓ సెక్షన్ ఆడియన్స్ చిరు-చరణ్ లి ఇలాంటి పాత్రల్లో చూస్తామనుకోలేదని..ఎంతో ఊహించుకుని థియేటర్ కి వచ్చామని కానీ తమ అంచనాలు పూర్తిగా తప్పాయని అంటున్నారు. కొరటాల మార్క్ సెన్సిబిలిటీ ఎక్కడ? అంటున్నారు.
మరికొంత మంది సినిమా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు. సినిమాపై కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని మీడియాలో కథనాలొస్తున్నాయి. ఏదీ ఏమైనాప్పటికీ `ఆచార్య`పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వస్తుంది. ఇది నిజంగా బిగ్ షాక్ అనే అనాలి. `ఆచార్య` ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది. అదీ తొలిసారి చిరంజీవి-చరణ్ కలిసి నటించారు. కానీ టాక్ మాత్రం పూర్తిగా నెగిటివ్ గా ఉంది.
రిలీజ్ కి ముందు చిరంజీవి సినిమాపై ఎంతో ధీమా వ్యక్తం చేసారు. రాజమౌళికి ఉన్న ప్లాప్ సెంట్ మెంట్ ని `ఆచార్య` చెరిపేస్తుందని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పారు. చిరు నమ్మకం చూసి నిజంగా అలా జరుగుతుందని మెజార్టీ వర్గం భావించింది. కానీ చిరు వ్యాఖ్యలకు భిన్నంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. మరోసారి రాజమౌళి సెంటిమెంట్ చరణ్ రూపంలో రిపీట్ అయినట్లే కనిపిస్తుంది. ఆ సంగతలు పక్కనబెడితే..
తాజాగా నెట్టింట `ఆచార్య` సినిమాకి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ గా మారింది. చిరజీవి-రామ్ చరణ్ ఆర్మీ దుస్తుల్లో మైనింగ్ ప్రాంతంలోకి వచ్చి గుండాలని కత్తులతో పొడిచి చంపేసిన సీన్ వైరల్ గా మారింది. ఎంతో సీరియస్ గా చేయాల్సిన ఫైట్ ని ఇంకెంతో సిల్లీగా చేసి సన్నివేశాన్ని కాల్చేసారు.
``ఈ సెక్యురిటీ వాళ్లు ఇంకా రాలేదేంటి? అనగానే చరణ్..చిరు జీపులోంచి దిగుతారు. బ్యాక్ గ్రౌండ్ లో సీరియస్ ఆర్ ఆర్ ప్లే అవుతుంది. ఇంతలో రాత్రి తాగిన మందు ఇంకా దిగలేదా? అంటే ``చిరంజీవి కత్తి తీసుకుని ప్రశ్నించిన వాళ్లని కసా కసా మని పీక మీద పొడిచేస్తారు. దీనిక చరణ్ ``ప్రసాద్ గారు నేను మాట్లాడుతున్నప్పుడు చంపేయడమేంటి అండి`` అంటే చిరంజీవి మాట్లాడండి మాట్లాడండి అంటే సీరియస్ గా అంటేనే హాస్యాన్ని పండించే ప్రయత్నం చేసారు.
ఇంతలో చరణ్ మీదకి వస్తోన్న మరో రౌడీని చరణ్ అదే స్టైల్లో కత్తి దింపుతాడు. దీనికి చిరంజీవి ఏంటి రామ్ ఈ ఆవేశం అంటే చరణ్ ``అదేంటి ప్రసాద్ గారు మీద మీదకి వస్తున్నాడు అంటారు. ఇంతలో మరో రౌడీ పొట్టలో `ఆచార్య` కత్తి దిగిపోతుంది. కావాలని పొడవలేదు. వాడే వచ్చి గుద్దు కున్నాడు అంటారు చిరు అక్కడ. చివరిగా అక్కడున్న ఆఫీసర్ కి సారీ సారీ అని చెప్పి వెళ్లిపోతారు గురు-శిష్యులు.
మరికొంత మంది సినిమా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు. సినిమాపై కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని మీడియాలో కథనాలొస్తున్నాయి. ఏదీ ఏమైనాప్పటికీ `ఆచార్య`పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వస్తుంది. ఇది నిజంగా బిగ్ షాక్ అనే అనాలి. `ఆచార్య` ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది. అదీ తొలిసారి చిరంజీవి-చరణ్ కలిసి నటించారు. కానీ టాక్ మాత్రం పూర్తిగా నెగిటివ్ గా ఉంది.
రిలీజ్ కి ముందు చిరంజీవి సినిమాపై ఎంతో ధీమా వ్యక్తం చేసారు. రాజమౌళికి ఉన్న ప్లాప్ సెంట్ మెంట్ ని `ఆచార్య` చెరిపేస్తుందని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పారు. చిరు నమ్మకం చూసి నిజంగా అలా జరుగుతుందని మెజార్టీ వర్గం భావించింది. కానీ చిరు వ్యాఖ్యలకు భిన్నంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. మరోసారి రాజమౌళి సెంటిమెంట్ చరణ్ రూపంలో రిపీట్ అయినట్లే కనిపిస్తుంది. ఆ సంగతలు పక్కనబెడితే..
తాజాగా నెట్టింట `ఆచార్య` సినిమాకి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ గా మారింది. చిరజీవి-రామ్ చరణ్ ఆర్మీ దుస్తుల్లో మైనింగ్ ప్రాంతంలోకి వచ్చి గుండాలని కత్తులతో పొడిచి చంపేసిన సీన్ వైరల్ గా మారింది. ఎంతో సీరియస్ గా చేయాల్సిన ఫైట్ ని ఇంకెంతో సిల్లీగా చేసి సన్నివేశాన్ని కాల్చేసారు.
``ఈ సెక్యురిటీ వాళ్లు ఇంకా రాలేదేంటి? అనగానే చరణ్..చిరు జీపులోంచి దిగుతారు. బ్యాక్ గ్రౌండ్ లో సీరియస్ ఆర్ ఆర్ ప్లే అవుతుంది. ఇంతలో రాత్రి తాగిన మందు ఇంకా దిగలేదా? అంటే ``చిరంజీవి కత్తి తీసుకుని ప్రశ్నించిన వాళ్లని కసా కసా మని పీక మీద పొడిచేస్తారు. దీనిక చరణ్ ``ప్రసాద్ గారు నేను మాట్లాడుతున్నప్పుడు చంపేయడమేంటి అండి`` అంటే చిరంజీవి మాట్లాడండి మాట్లాడండి అంటే సీరియస్ గా అంటేనే హాస్యాన్ని పండించే ప్రయత్నం చేసారు.
ఇంతలో చరణ్ మీదకి వస్తోన్న మరో రౌడీని చరణ్ అదే స్టైల్లో కత్తి దింపుతాడు. దీనికి చిరంజీవి ఏంటి రామ్ ఈ ఆవేశం అంటే చరణ్ ``అదేంటి ప్రసాద్ గారు మీద మీదకి వస్తున్నాడు అంటారు. ఇంతలో మరో రౌడీ పొట్టలో `ఆచార్య` కత్తి దిగిపోతుంది. కావాలని పొడవలేదు. వాడే వచ్చి గుద్దు కున్నాడు అంటారు చిరు అక్కడ. చివరిగా అక్కడున్న ఆఫీసర్ కి సారీ సారీ అని చెప్పి వెళ్లిపోతారు గురు-శిష్యులు.
ఈ మొత్తం యాక్షన్ ఎపిసోడ్ ఎంతో సీరియస్ గా సాగాలి. కానీ ఎంతో కామెడీగా సాగుతుంది. కొరటాల మార్క్ యాక్షన్ ఎక్కడా కనిపించలేదు. చిరంజీవి మార్క్ కామెడీ ఈ యాక్షన్ సీన్ లో ఏమాత్రం నవ్వు తెప్పించలేదు. `ఖలేజా` సినిమాలో మహేష్ టైమింగ్ లేని జోకులాగే `ఆచార్య`లో ఈ సన్నివేశం కనిపిస్తుంది.