Begin typing your search above and press return to search.
క్లిక్ క్లిక్ : అలా నడుచుకుంటూ అల్లూరి.. కొమురం భీమ్
By: Tupaki Desk | 20 March 2022 2:35 PM GMTరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈనెల 25న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు చాలా సీరియస్ గా యాక్షన్ మూడ్ లోనే కనిపించారు. ఎట్టకేలకు సినిమా మరో అయిదు రోజుల్లో విడుదల కాబోతుంది అంటూ ఈ రెండు ఫోటో లను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇద్దరు హీరోలు చాలా కూల్ గా నవ్వుకుంటూ అలా నడుచుకుంటూ వస్తుంటే సినిమా పై ఉన్న అంచనాలు పది రెట్లు అయ్యాయి అనిపిస్తుంది. సినిమాకు సంబంధించిన విడుదల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ముగ్గురు ఆర్ లు చక్కర్లు కొడుతున్నారు. ఉత్తర భారతం.. దక్షిణ భారతం అనే తేడా లేకుండా రోజుకు రెండు రాష్ట్రాల చొప్పున చుట్టేస్తున్నారు. ఢిల్లీ లో ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.
ఒక వైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ లు.. ప్రెస్ మీట్ లు మరో వైపు ఇంటర్వ్యూలు ఇలా రకరకాలుగా సినిమా ను ఎన్టీఆర్.. రామ్ చరణ్ మరియు రాజమౌళిలు ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియా టీమ్ సినిమాకు సంబంధించిన విషయాలతో ట్విట్టర్.. ఇన్ స్టా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై సందడి చేస్తూ ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉన్నారు.
తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ఇద్దరు హీరోలకు సంబంధించిన ఈ స్టిల్స్ ను రిలీజ్ చేయడం ద్వారా అంచనాలు మరింతగా పెంచడం జరిగింది. చాలా ఆసక్తిగా ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్ లు ఉన్నాయి. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా టాక్ నడుస్తుంది. సోషల్ మీడియాలో ఈ పోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లను ఈ పాత్రల్లో ఎప్పుడెప్పుడు వెండి తెరపై చూస్తామా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇద్దరు హీరోలు చాలా కూల్ గా నవ్వుకుంటూ అలా నడుచుకుంటూ వస్తుంటే సినిమా పై ఉన్న అంచనాలు పది రెట్లు అయ్యాయి అనిపిస్తుంది. సినిమాకు సంబంధించిన విడుదల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ముగ్గురు ఆర్ లు చక్కర్లు కొడుతున్నారు. ఉత్తర భారతం.. దక్షిణ భారతం అనే తేడా లేకుండా రోజుకు రెండు రాష్ట్రాల చొప్పున చుట్టేస్తున్నారు. ఢిల్లీ లో ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.
ఒక వైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ లు.. ప్రెస్ మీట్ లు మరో వైపు ఇంటర్వ్యూలు ఇలా రకరకాలుగా సినిమా ను ఎన్టీఆర్.. రామ్ చరణ్ మరియు రాజమౌళిలు ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియా టీమ్ సినిమాకు సంబంధించిన విషయాలతో ట్విట్టర్.. ఇన్ స్టా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై సందడి చేస్తూ ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉన్నారు.
తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ఇద్దరు హీరోలకు సంబంధించిన ఈ స్టిల్స్ ను రిలీజ్ చేయడం ద్వారా అంచనాలు మరింతగా పెంచడం జరిగింది. చాలా ఆసక్తిగా ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్ లు ఉన్నాయి. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా టాక్ నడుస్తుంది. సోషల్ మీడియాలో ఈ పోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లను ఈ పాత్రల్లో ఎప్పుడెప్పుడు వెండి తెరపై చూస్తామా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.