Begin typing your search above and press return to search.
`పుష్ప 2`తో సుక్కు.. RC15 తో చరణ్ బిజీ కానీ..
By: Tupaki Desk | 5 March 2022 1:30 AM GMTఅల్లు అర్జున్ - సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ `పుష్ప ది రైజ్`. గత ఏడాది డిసెంబర్ లో భారీ అంచనాల మధ్య హడావిడిగా విడుదలైన ఈ మూవీ అనూహ్యంగా భారీ వసూళ్లని రాబట్టి పాన్ ఇండియా స్థాసయిలో సంచలనాలు సృష్టించింది. బన్నీ వన్ మ్యాన్ షోగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఉత్తరాదిలో ఊహించని విధంగా 100 కోట్ల మార్కుని సునాయాసంగా దాటి ట్రేడ్ పండితుల్ని విస్మయ పరిచింది.
ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో `పుష్ప` టీమ్ సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఇటీవలే మళ్లీ పార్ట్ 2కు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా మారిపోయింది. హీరో బన్నీ ప్రస్తుతం రిషీకేష్ యాత్రలో వున్నారు. తిరిగి వచ్చాక ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేసి ఏప్రిల్ లో పార్ట్ 2 ని మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఉత్తరాదిలో వచ్చిన అనూహ్య స్పందనని దృష్టిలో పెట్టుకుని వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం పార్ట్ 2లో భారీ మార్పులు చేస్తున్నారట.
ఇదిలా వుంటే సుకుమార్ `పుష్ప 2` తరువాత మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన `రంగస్థలం` టాలీవుడ్ సినీ చరిత్రలోనే వన్ ఆఫ్ ద క్లాసిక్ గా నిలిచింది. జాతీయ అవార్డుల్లో `మహానటి` తరుపున కీర్తి సురేష్ పోటీ లేకపోతే చిట్టిబాబు పాత్రకు జాతీయ అవార్డు దక్కేదని ఇప్పటికీ ఇండస్ట్రీ జనం, అభిమానులు అంటూనే వుంటారు.
అలాంటి క్లాసికల్ బ్లాక్ బస్టర్ ని అందించిన సుకుమార్ - రామ్ చరణ్ ల కాంబినేషన్ మళ్లీ సెట్టయితే బాగుంటుందని, మరోసారి అంతకు మించిన మ్యాజిక్ ని వీరు చేస్తే చూడాలని అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే వారికి సుకుమార్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం `పుష్ప 2` పనుల్లో బిజీగా వున్న సుకుమార్ .. హీరో మెగా పవర్ స్టార్ కు లైన్ వినిపించారని, చరణ్ కు అది బాగా నచ్చిందని తెలిసింది.
చరణ్ కు ఐడియా నచ్చడంతో సుకుమార్ పూర్తి కథని త్వరలో పూర్తి చేసి వినిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఫైనల్ స్క్నిప్ట్ కి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం వుందని, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ నిర్మించాలనే ఆలోచనలో వున్నారని, దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తారని ఇన్ సైడ్ టాక్.
ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో `పుష్ప` టీమ్ సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఇటీవలే మళ్లీ పార్ట్ 2కు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా మారిపోయింది. హీరో బన్నీ ప్రస్తుతం రిషీకేష్ యాత్రలో వున్నారు. తిరిగి వచ్చాక ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేసి ఏప్రిల్ లో పార్ట్ 2 ని మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఉత్తరాదిలో వచ్చిన అనూహ్య స్పందనని దృష్టిలో పెట్టుకుని వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం పార్ట్ 2లో భారీ మార్పులు చేస్తున్నారట.
ఇదిలా వుంటే సుకుమార్ `పుష్ప 2` తరువాత మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన `రంగస్థలం` టాలీవుడ్ సినీ చరిత్రలోనే వన్ ఆఫ్ ద క్లాసిక్ గా నిలిచింది. జాతీయ అవార్డుల్లో `మహానటి` తరుపున కీర్తి సురేష్ పోటీ లేకపోతే చిట్టిబాబు పాత్రకు జాతీయ అవార్డు దక్కేదని ఇప్పటికీ ఇండస్ట్రీ జనం, అభిమానులు అంటూనే వుంటారు.
అలాంటి క్లాసికల్ బ్లాక్ బస్టర్ ని అందించిన సుకుమార్ - రామ్ చరణ్ ల కాంబినేషన్ మళ్లీ సెట్టయితే బాగుంటుందని, మరోసారి అంతకు మించిన మ్యాజిక్ ని వీరు చేస్తే చూడాలని అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే వారికి సుకుమార్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం `పుష్ప 2` పనుల్లో బిజీగా వున్న సుకుమార్ .. హీరో మెగా పవర్ స్టార్ కు లైన్ వినిపించారని, చరణ్ కు అది బాగా నచ్చిందని తెలిసింది.
చరణ్ కు ఐడియా నచ్చడంతో సుకుమార్ పూర్తి కథని త్వరలో పూర్తి చేసి వినిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఫైనల్ స్క్నిప్ట్ కి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం వుందని, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ నిర్మించాలనే ఆలోచనలో వున్నారని, దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తారని ఇన్ సైడ్ టాక్.