Begin typing your search above and press return to search.

చెర్రోపాసన ఏదైనా ర‌హ‌స్య ప్ర‌దేశానికి వెళ్లారా?

By:  Tupaki Desk   |   14 Jun 2021 2:30 PM GMT
చెర్రోపాసన ఏదైనా ర‌హ‌స్య ప్ర‌దేశానికి వెళ్లారా?
X
టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న చిన్న‌నాటి స్నేహితురాలు అపోలో సంస్థ‌ల అధినేత్రి ఉపాస‌న కామినేనిని ప్రేమించి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. 14 జూన్ 2012న వివాహమైంది. నేటితో 9ఏళ్లు అయ్యింది. ఈ ప్ర‌త్యేక సంద‌ర్భంలో చ‌ర‌ణ్ త‌న భార్య కోసం ఎలాంటి ప్ర‌ణాళిక వేశారు? అంటే.. అందుకు ప్రూఫ్ గా తాజాగా ఓ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేశారు.

చ‌ర‌ణ్‌- ఉపాస‌న స్పెష‌ల్ ఫ్లైట్ లో సుదూర తీరాల‌కు ప్ర‌యాణం అయ్యారు. ప్ర‌తిసారీ వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఈ జంట విదేశీ విహారాల‌కు వెళుతుంటారు. ఇంత‌కుముందు ద‌క్షిణాఫ్రికాలోని ఓ ద‌ట్ట‌మైన అడ‌విలోకి వెళ్లి వైల్డ్ లైఫ్ ఫోటోగ్ర‌ఫీని ఆస్వాధించారు. ఈసారి ప్ర‌యాణం ఎంత‌వ‌ర‌కూ అన్న‌ది తెలియ‌రాలేదు. తాజాగా ఉపాస‌న‌ చ‌ర‌ణ్ షేర్ చేసిన‌ది త్రోబ్యాక్ ఫోటోనా ఇంకేదైనానా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఈ ఫోటోలో చరణ్ - ఉపసనా ఇద్దరూ విమానంలో కెమెరాకు పోజులిచ్చారు. సన్ గ్లాసెస్ ధరించి కూల్ గా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ``ఇది నిజమైన ధృఢ‌మైన ఉత్తేజ‌క‌ర‌మైనది..మాకు చీర్స్`` అన్న వ్యాఖ్య‌ను ఉపాస‌న ఈ ఫోటోకి జోడించారు.

చ‌రణ్ టాలీవుడ్ లో పెద్ద స్టార్ గా ఎదిగారు. ప్ర‌స్తుతం పాన్ ఇండియన్ మూవీ ఆర్.ఆర్.ఆర్ స‌హా ఆచార్య‌లో న‌టిస్తున్నారు. త‌దుప‌రి శంక‌ర్ దర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నారు. ఉపాస‌న అపోలో హెల్త్ మ్యాగజైన్ నిర్వ‌హ‌ణ స‌హా దాతృత్వ కార్యకలాపాలతో బిజీగా ఉన్నారు. ఆమె ఇప్పుడు అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బోర్డు సభ్యులలో ఒకరిగా కొన‌సాగుతున్నారు.