Begin typing your search above and press return to search.

#RC15..కొండ కోన‌ల్లో హెలీకాఫ్ట‌ర్ లో దిగారు!

By:  Tupaki Desk   |   4 Nov 2021 4:10 AM GMT
#RC15..కొండ కోన‌ల్లో హెలీకాఫ్ట‌ర్ లో దిగారు!
X
శంక‌ర్ సెలెక్ష‌నా మ‌జాకానా? ఆయ‌న ఒక లొకేష‌న్ ని ఎంపిక చేస్తే .. లేదా ఆయ‌న ఒక స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తే అక్క‌డ యాంబియ‌న్స్ ప్ర‌త్యేక ముద్ర‌ను క‌లిగి ఉంటుంది. ప్రేక్ష‌కులు ఆ అద్భుత‌మైన లొకేష‌న్ ఎక్క‌డుంది? అని ప్ర‌శ్నించేంత‌గా అతడి ఎంపిక ఉంటుంది. ఇప్పుడు ఆర్.సి 15 కోసం అలాంటి లొకేష‌న్ల‌నే ఎంపిక చేసార‌ని అర్థ‌మ‌వుతోంది.

తాజాగా శంక‌ర్ - చ‌ర‌ణ్ అండ్ టీమ్ ఒక ఎత్తైన ప‌ర్వ‌తంపై హెలీకాఫ‌ర్ట్ లో దిగారు. అంతేకాదు హెలీకాఫ్ట‌ర్ ముందే నిల‌బ‌డి గ్రూప్ ఫోటో దిగి సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేశారు. టోట‌ల్ టెక్నిక‌ల్ టీమ్ ఈ ఫోటోగ్రాఫ్ లో క‌నిపిస్తోంది. ఇటీవ‌ల పూణేలో ఆర్.సి 15 తొలి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఆర్.సి 15 ఇటు చ‌ర‌ణ్ కి అటు శంక‌ర్ కి దిల్ రాజుకు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం. ఈ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ పాన్ ఇండియా స్టార్ గా త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకోవాల్సి ఉంటుంది. అటుపై ఇత‌ర స్టార్ల‌కు ధీటుగా త‌న కెరీర్ రేంజు ఏంటో చూపించాల్సి ఉంటుంది. అలాగే భార‌తీయుడు 2 వివాదాల అనంత‌రం శంక‌ర్ కి కూడా ఆర్.సి 15 చాలా కీల‌కంగా మారింది. ఎట్టి ప‌రిస్థితిలో చెప్పిన టైమ్ కి చెప్పిన బ‌డ్జెట్లో సినిమాని తెర‌కెక్కంచి రిలీజ్ చేయించాల్సి ఉంది. అందుకే శంక‌ర్ జెట్ స్పీడ్ తో చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తున్నారు. ఆయ‌న కెరీర్ లో మునుపెన్న‌డూ లేనంత ప్ర‌ణాళికా బ‌ద్ధంగా ఈ సినిమాని పూర్తి చేస్తున్నారంటూ క‌థ‌నాలు రావ‌డం ఆస‌క్తిక‌రం. చర‌ణ్ .. త‌న స్నేహితుడు తార‌క్ తో క‌లిసి న‌టించిన ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి కానుక‌గా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

టైటిల్ పై ఉత్కంఠ‌.. ప్ర‌క‌టించేదెపుడు?

దాదాపు 500కోట్ల బ‌డ్జెట్ తో అత్యంత భారీగా తెర‌కెక్క‌నున్న ఆర్.సి.15 చిత్రానికి శంక‌ర్ ఎలాంటి టైటిల్ ని ఎంపిక చేశారు? అంటే... కాస్త వెరైటీ టైటిల్ ఇటీవ‌ల‌ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. శంకర్ ఈ చిత్రానికి `విశ్వంభర` అనే టైటిల్ ని ఎంపిక చేశారని ప్ర‌చార‌మ‌వుతోంది. శంకర్ గతంలోనూ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలు చేశారు. కానీ ఈసారి టైటిల్ ఎంపిక కాస్త ఆలోచింప‌జేసేదిగా ఉంటుందని క‌థ‌నాలొచ్చాయి. అయితే టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. చ‌ర‌ణ్ ని మునుపెన్న‌డూ చూడ‌నంత విభిన్నంగా ఒక‌ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంలో శంక‌ర్ చూపించ‌నున్నారు. ఇందులో అత‌డు ఛాలెంజింగ్ యువ‌ ముఖ్య‌మంత్రిగా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం ఉంది. చ‌ర‌ణ్ స‌ర‌స‌న కియరా అద్వాణీ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు విల‌న్ గా న‌టిస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. క‌మెడియ‌న్ సునీల్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు.

ప్ర‌తి పాత్రా దేనిక‌దే ప్ర‌త్యేకం..!

శంక‌ర్ మ‌రోసారి `ఒకే ఒక్క‌డు` రేంజు సినిమా తీస్తున్నార‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం సాగిన సంగ‌తి తెలిసిందే. నిజంగానే సీక్వెల్ తీస్తున్నారా? అంటూ అంద‌రిలో ఒక‌టే సందేహం. లాంచింగ్ డే పోస్ట‌ర్ లో చ‌ర‌ణ్ స‌హా టీమ్ అంతా క‌నిపించారు. అందాల కియ‌రా అద్వాణీ సీరియ‌స్ అధికారిలా క‌నిపిస్తున్న చెర్రీ ప‌క్క‌నే క‌నిపించింది. బ‌హుశా త‌న పాత్ర ఐఏఎస్ అధికారి అయిన చ‌ర‌ణ్ కి పీఏగా క‌నిపిస్తుందా? అన్న‌ది సుస్ప‌ష్ఠంగా ఉంది. అంతేకాదు కియ‌రా పాత్ర క‌థ‌నే మ‌లుపు తిప్పే విధంగా ఉంటుంద‌ని కూడా లీకులు తాజాగా అందాయి. RC15 లో కీలక మలుపు తీసుకురావడానికి ఈ పాత్రను శంక‌ర్ డిజైన్ చేశార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కేవలం డ్యాన్సులు పాట‌ల‌ రొమాన్స్ కోసమే కియ‌రా పాత్ర ప‌రిమితం కాద‌ని తెలిసింది. శంకర్ ఆమెకు కీలక పాత్రలో ఛాన్సిచ్చారు. గ్లామ‌ర్ ఎలివేష‌న్ ని మించి ఆమె పాత్ర కథలో భారీ మలుపు తీసుకువస్తుందని యూనిట్ వర్గాల సమాచారం. కియారా సౌత్ నార్త్ లో అగ్ర క‌థానాయిక‌. త‌న పాత్ర చాలా బలంగా ఉన్నందున శంకర్ స్క్రిప్ట్ విని వెంటనే ఓకే చేసిందట‌. ఇక సునీల్ పాత్ర‌లో ట్విస్టు కూడా అంతే ఇదిగా ఆక‌ట్టుకుంటుంద‌ని చెబుతున్నారు.