Begin typing your search above and press return to search.
బీఎస్ ఎఫ్ సోల్జర్స్ కి చరణ్ స్పెషల్ ట్రీట్
By: Tupaki Desk | 19 April 2022 11:42 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ మల్టీ స్టారర్ మూవీ `ట్రిపుల్ ఆర్`. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూల్లని రాబట్టి పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా పలు రికార్డుల్ని తిరగరాస్తూ సంచలనం సృష్టించింది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని శంకర్ తో చేస్తున్న విషయం తెలిసిందే.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రాజమండ్రిలో పలు కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ గత కొన్ని రోజులుగా పంజాబ్ లోని అమృత్ సర్ లో జరుగుతోంది. ఇటీవల విడుదలైన `ట్రిపుల్ ఆర్`తో ఉత్తరాదిలో చరణ్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ కారణంగా పంజాబ్ లో షూటింగ్ చేస్తుండగా ఇటీవల పంజాబ్ పోలీసులు సెట్లో సందడి చేశారు. చరణ్ తో సెల్ఫీల కోసం పోటీ పడ్డారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పడు అమృతసర్ బీఎస్ ఎఫ్ జవాన్ల వంతు. అమృత్ సర్ లో శంకర్ డైరెక్షన్ లో ప్రస్తుతం చరణ్ నటిస్తున్న మూవీ కీలక ఘట్టాల షూటింగ్ జరుగుతోంది. ఈ నేఫథ్యంలో బీఎస్ ఎఫ్ జవాన్లకు చరణ్ స్పెషల్ ట్రీట్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సినిమా షూటింగ్ కు చిన్న విరామం లభించడంతో చరణ్ అమృత్ సర్ సమీపంలోని ఖాసా సరిహద్దుకు వెళ్లారు.
అక్కడ విధులు నిర్వహిస్తున్న బీఎస్ ఎఫ్ జవాన్లతో ముచ్చటించారు. ఆనంతరం తన మూవీ కోసం తీసుకొచ్చిన హైదరాబాద్ చెఫ్ తో వారి కోసం ప్రత్యేకంగా వంటలు చేయించయి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ప్రత్యేక వంటలు చేయించిన బీఎస్ ఎఫ్ జవాన్లతో కలిసి చరణ్ భోజనం చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. చరణ్ `RC15` లో ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. పీరియడిక్ నేపథ్యంలో సాగే ఈ మూవీ సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో సాగనుందని చిత్ర వర్గాల సమాచారం.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రాజమండ్రిలో పలు కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ గత కొన్ని రోజులుగా పంజాబ్ లోని అమృత్ సర్ లో జరుగుతోంది. ఇటీవల విడుదలైన `ట్రిపుల్ ఆర్`తో ఉత్తరాదిలో చరణ్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ కారణంగా పంజాబ్ లో షూటింగ్ చేస్తుండగా ఇటీవల పంజాబ్ పోలీసులు సెట్లో సందడి చేశారు. చరణ్ తో సెల్ఫీల కోసం పోటీ పడ్డారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పడు అమృతసర్ బీఎస్ ఎఫ్ జవాన్ల వంతు. అమృత్ సర్ లో శంకర్ డైరెక్షన్ లో ప్రస్తుతం చరణ్ నటిస్తున్న మూవీ కీలక ఘట్టాల షూటింగ్ జరుగుతోంది. ఈ నేఫథ్యంలో బీఎస్ ఎఫ్ జవాన్లకు చరణ్ స్పెషల్ ట్రీట్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సినిమా షూటింగ్ కు చిన్న విరామం లభించడంతో చరణ్ అమృత్ సర్ సమీపంలోని ఖాసా సరిహద్దుకు వెళ్లారు.
అక్కడ విధులు నిర్వహిస్తున్న బీఎస్ ఎఫ్ జవాన్లతో ముచ్చటించారు. ఆనంతరం తన మూవీ కోసం తీసుకొచ్చిన హైదరాబాద్ చెఫ్ తో వారి కోసం ప్రత్యేకంగా వంటలు చేయించయి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ప్రత్యేక వంటలు చేయించిన బీఎస్ ఎఫ్ జవాన్లతో కలిసి చరణ్ భోజనం చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. చరణ్ `RC15` లో ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. పీరియడిక్ నేపథ్యంలో సాగే ఈ మూవీ సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో సాగనుందని చిత్ర వర్గాల సమాచారం.