Begin typing your search above and press return to search.

సుహాసిని బ‌ర్త్ డే పార్టీలో ర‌మ్య‌-ఖుష్బూ తీన్ మార్!

By:  Tupaki Desk   |   19 Aug 2021 11:30 PM GMT
సుహాసిని బ‌ర్త్ డే పార్టీలో ర‌మ్య‌-ఖుష్బూ తీన్ మార్!
X
80ల నాటి తార‌లంతా ఓ చోట చేరి ప్ర‌తియేటా చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. ఇంత‌కుముందు మెగాస్టార్ చిరంజీవి ఎయిటీస్ క్లాస్ తార‌ల్ని త‌మ రెనోవేష‌న్ ఇంటికి పిలిచి అదిరిపోయే పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో స్టార్లంతా డ్యాన్సులు పాట‌ల‌తో దుమ్ము లేపారు. మెగాస్టార్ చిరంజీవి త‌న క‌థానాయిక‌ల‌తో ఆడిపాడి బోలెడంత సంద‌డి చేశారు.

నాటి మేటి తార‌ల‌లో మీనా- రమ్యకృష్ణ- సుహాసిని-ఖుష్బూ- రాధిక ఇప్ప‌టికీ ఎంతో యాక్టివ్ గా న‌ట‌న‌లో కొన‌సాగుతున్నారు. అడ‌పాద‌డ‌పా త‌మ‌కు వ‌చ్చే ఏ అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌డం లేదు. ర‌మ్య‌కృష్ణ ఇప్ప‌టికీ త‌మిళంలో టాప్ స్టార్ గా కొన‌సాగుతున్నారు. రాధిక నిర్మాత‌గా న‌టిగా సంచ‌ల‌నాలు సృష్టిస్తుండ‌గా.. సుహాసిని నిర్మాత‌గానే గాక న‌టిగానూ సంద‌డి చేస్తున్నారు. మ‌రోవైపు భ‌ర్త మ‌ణిర‌త్నంతో క‌లిసి ద‌ర్శ‌క‌త్వ విభాగంలోనూ ప‌ని చేస్తున్నారు.

వీరంతా సోష‌ల్ మీడియాల్లోనూ ఎంతో జోష్ ని క‌న‌బ‌రుస్తున్నారు. ఇటీవ‌ల సుహాసిని మ‌ణిర‌త్నం బ‌ర్త్ డే వేడుక‌ల సంద‌ర్భంగా ఫ్రెండ్స్ పార్టీలో మునిగి తేలారు. ఈ పార్టీలో సుహాసిని-ఖుష్బూ-రాధిక డ్యాన్సుల‌తో అద‌ర‌గొట్టారు. ఇక ఎప్పుడూ జోష్ తో వెలుగుతూ ఉండే సుహాసిని ని క‌లుసుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని ర‌మ్య‌కృష్ణ అన‌గా.. ల‌వ్ యు ర‌మ్య కుట్టీ అంటూ ప్రేమ‌ను క‌న‌బ‌రిచారు సుహాసిని.

ర‌మ్య‌కృష్ణ ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. లైగర్- రిపబ్లిక్- రంగమార్తాండ లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఖుష్బూ శర్వానంద్ సినిమాలో నటిస్తున్నారు. సుహాసిని ఇటీవ‌ల ఓ వెబ్ సిరీస్ లో ఎపిసోడ్ కి దర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌రోవైపు సుహాసిని బ‌ర్త్ డే సంద‌ర్భంగా 60ఏళ్ల నాటి త‌మ పాత ఇంటికి హాస‌న్ కుటుంబ స‌భ్యులంతా హాజ‌ర‌య్యారు. సుహాసిని బ‌ర్త్ డే వేడుక‌ల్లో క‌మ‌ల్ హాస‌న్- చారుహాస‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు. వీళ్ల‌తో అక్ష‌ర‌హాస‌న్ కూడా ఆ ఫోటోగ్రాఫ్ లో క‌నిపించింది.

మెగా పార్టీని ఇంకా ఎవ‌రూ మ‌రువ‌లేదు!

మెగాస్టార్ రీమోడ‌ల్ చేయించుకున్న జూబ్లీహిల్స్ ఇంట్లో ఎయిటీస్ (80ల నాటి) తారాతోర‌ణం కొలువు తీరిన సంగ‌తి తెలిసిందే. పార్టీలో బ్లాక్ క‌ల‌ర్ స్పెష‌ల్ డ్రెస్ కోడ్ తో దాదాపు 40 మంది తార‌లు సంద‌డి చేశారు. సెల‌బ్రేష‌న్ నుంచి ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ముఖ్యంగా తార‌లంతా ఒకే ఫ్రేమ్ లో క‌నిపించడం అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ గా నిలిచింది.

ఈ పార్టీలో ప్ర‌త్యేకించి ఎన‌భైల నాటి అంద‌గ‌త్తెలంతా ఉన్నారు. జ‌య‌ప్ర‌ద‌-సుమ‌ల‌త‌-రాధిక‌- సుహాసిని- శోభ‌న‌-రాధ‌-జ‌య‌సుధ‌- అమ‌ల వంటి స్టార్లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇక వీళ్లంద‌రితో పాటుగా అల‌నాటి మేటి నాయిక‌.. ప్ర‌స్తుత రాజ‌కీయ నాయ‌కురాలు ఖుష్బూ కూడా ఈ వేడుక‌ల‌కు ఎటెండ‌య్యారు. నాటి పార్టీలో ఖుష్బూ తో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సెల్ఫీ లు వైర‌ల్ అయ్యాయి. పార్టీని గ్రాండ్ స‌క్సెస్ చేయ‌డం కోసం మెగాస్టార్ తో పాటుగా చ‌ర‌ణ్ విందు ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌వ్వ‌డం క‌నిపించింది. డాడీ ఏర్పాటు చేసిన పార్టీ కావ‌డంతో ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగానే తీసుకున్నారు. ఆ ఫోటోలు ఇప్ప‌టికీ వెబ్ లో క‌నిపిస్తూనే ఉన్నాయి.