Begin typing your search above and press return to search.

స్టార్‌ కపుల్‌ కోసం 50 కోట్లతో రెడీ అవుతోంది!

By:  Tupaki Desk   |   17 Nov 2018 11:04 AM GMT
స్టార్‌ కపుల్‌ కోసం 50 కోట్లతో రెడీ అవుతోంది!
X
బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణ్‌ వీర్‌ సింగ్‌, దీపిక పదుకునే తాజాగా ఇటలీలోని ఒక భారీ ఐలాండ్‌ లో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరి వివాహం రెండు సాంప్రదాయాల్లో జరిగింది. అతి కొద్ది మంది ప్రముఖ గెస్ట్‌ ల సమక్షంలో వైభంగా జరిగిన వీరి పెళ్లి తంతు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. పెళ్లి తంతు ముగించుకుని ఈ జంట బెంగళూరుకు విచ్చేయనున్నారు. ఈనెల 21న బెంగళూరులో వీరు తమ పెళ్లి పార్టీని ఇచ్చేందుకు సిద్దం అయ్యారు.

బెంగళూరులో పెళ్లి పార్టీ తర్వాత ముంబయిలో రిసెప్షన్‌ ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. రిసెప్షన్‌ లో భారీ ఎత్తున బాలీవుడ్‌ సినీ ప్రముఖులతో పాటు - బంధు మిత్రులు - మీడియా వారు ఇంకా వ్యాపార ప్రముఖులు - రాజకీయ నాయకులు కూడా పాల్గొనబోతున్నారు. ఒకవైపు పెళ్లి హడావుడి ఉండగానే మరో వైపు తాము నివాసం ఉండేందుకు ముంబయిలోని ఖరీదైన ఏరియాలో అతి విలాసవంతమైన ఒక భవనంను ఈ జంట ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 50 కోట్లతో ఒక భవనంను ఈ జంట కొనుగోలు చేశారని, ప్రస్తుతం ఆ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్‌ వర్క్‌ జరుగుతుందని తెలుస్తోంది. పెళ్లి హడావుడి అంతా పూర్తి అయిన తర్వాత వీరిద్దరు ఆ ఇంట్లోనే నివాసం ఉండబోతున్నారు. బాలీవుడ్‌ స్టార్స్‌ ల్లో వీరి ఇల్లు ప్రత్యేకంగా ఉండబోతుందని, అత్యాధునిక హంగులు ఈ ఇంట్లో ఉంటాయని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరిద్దరు కూడా అతి త్వరలోనే మళ్లీ షూటింగ్స్‌ కు హాజరు కాబోతున్నారు. రణ్‌ వీర్‌ సింగ్‌ నటించిన సింబా చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.