Begin typing your search above and press return to search.

థియేటర్‌ లో శ్రీవల్లీ హంగామా

By:  Tupaki Desk   |   5 March 2022 4:28 AM GMT
థియేటర్‌ లో శ్రీవల్లీ హంగామా
X
హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా థియేటర్లలో హడావుడి చేస్తోంది. ఈ సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా గురించి మరింతగా మీడియాలో వార్తలు వచ్చేలా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.

హీరో శర్వానంద్‌ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. సినిమా లో వర్క్‌ ఎక్స్ పీరియన్స్ గురించి ఆయన వెళ్లడిస్తూ వస్తున్నాడు. ఇదే సమయంలో రష్మిక మందన్నా అభిమానులతో కలిసి సినిమాను చూసేందుకు థియేటర్‌ కు వెళ్లింది. అక్కడ సింపుల్‌ గా అభిమానులతో కలిసి సినిమా చూసిన రష్మిక అందరి దృష్టిని ఆకర్షించింది. నెట్టింట ఆమె ఫోటోలు మరియు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

రష్మిక మందన్నా చాలా నాచురల్‌ లుక్ లో హైదరాబాద్‌ లోని ఒక థియేటర్‌ లో ఆడవాళ్లు మీకు జోహార్లు చూసేందుకు వెళ్లింది. థియేటర్‌ లో ఆమెను చూసేందుకు అభిమానులు హడావుడి చేశారు. అక్కడ ఉన్న అభిమానులత వద్దకు వెళ్లి కలిసి కూర్చుని సినిమాను ఎంజాయ్‌ చేసింది. అభిమానులతో కలిసి సినిమా చూడటం చాలా బాగుంది అంటూ రష్మిక మందన్నా చెప్పుకొచ్చిందట.

పుష్ప సినిమా లో శ్రీవల్లి పాత్రకు రష్మిక అనూహ్యమైన రెస్పాన్స్ ను దక్కించుకుంది. దాంతో ఈ అమ్మడికి అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ సమయంలో ఈమె నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కు పుష్ప క్రేజ్ కలిసి వచ్చిందంటూ ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు వచ్చిన బజ్‌ కారణంగా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి అనే టాక్ వినిపిస్తోంది.

హీరోయిన్ గా శర్వానంద్‌ తో ఈమె కెమిస్ట్రీ చాలా బాగుంది అంటూ రివ్యూలు వచ్చాయి. అల్లరి పిల్లగా.. సీరియస్ లుక్ లో ఇలా ఏ పాత్ర చేసినా కూడా రష్మిక మందన్నా అద్బుతంగా సెట్‌ అవుతుందని.. ముందు ముందు ఈమె నుండి మరిన్ని మంచి సినిమాలు వస్తాయనే నమ్మకం ఉందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ను ప్రమోట్‌ చేయడం కోసం అభిమానులతో కలిసి థియేటర్ లో సినిమా చూసేందుకు వెళ్లిన రష్మిక మందన్నా కు అభినందనలు అంటూ మీడియా సర్కిల్స్ వారు కామెంట్స్ చేస్తున్నారు.